సాధ్యమని, కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ మండలంలోని ఆద్మాపూర్, జక్కపల్లి, చిప్పల్తుర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పేదల కోసం పని చేసే ప్రభుత్వమని, మ్యానిఫెస్టోలోని హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పల్లెప్రగతితో గ్రామాలు తండాల్లో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు.
నర్సాపూర్, నవంబర్ 11: బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి సాధ్యపడిందని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శనివారం నర్సాపూర్ మండలంలోని ఆద్మాపూర్, జక్కపల్లి, చిప్పల్తుర్తి గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి తండాకు, గ్రామ పంచాయతీకి సీసీ రోడ్డు వేసినట్లు తెలిపారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి తదితర పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారన్నా రు. యాదవులకు గొర్రెలు పంపిణీ చేసి, వారి ఆర్థికాభివృద్ధికి సహకరించారన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.16వేలు, వృద్ధులకు ఆసరా పింఛన్ రూ.5016, దివ్యాంగులకు రూ.6016, ఇంటింటికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, మహిళలకు నెలకు రూ. 3000, రూ.400లకే గ్యాస్ సిలిండర్, అసైన్డ్, పోడు భూములకు పట్టాలు, ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలకు పెంపు, మహిళా సమాక్య భవనాల నిర్మాణం లాంటి అద్భుతమైన మ్యానిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు.
ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీటన్నింటినీ చేస్తామని వెల్లడించారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అధికారంలోకి రాగానే గ్రామాల్లో ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ యాదవులంతా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు ఆపాలని కుట్రలు చేస్తున్నదన్నారు. కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రైతులకు మంచి రోజులు వచ్చాయని, దేశంలో 24 గంటల కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గతంలో పల్లెలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయినయో చూసి ఓటేయాలన్నారు. ప్రచారంలో ఎంపీటీసీ సంధ్యారాణి ఛత్రునాయక్, సర్పంచ్లు శ్రీనివాస్ వెంకటలక్ష్మి, శ్యామల లక్ష్మణ్గౌడ్, జితేందర్రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, మాజీ ఎంపీపీ లలిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు సత్యంగౌడ్, శ్రీనివాస్రెడ్డి, సూరారం నర్సింహులు, తొంట వెంకట్, రవి, సేనాధిపతి తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట, నవంబర్ 11: బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని గోమారంలోని ఆమె నివాసంలో శంకర్తండాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉన్న అంశాలను ప్రతి కార్యకర్త ప్రజలకు వివరించాలని, ఎన్నికల్లో అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అశోక్రెడ్డి, బోళ్ల భారతిభిక్షపతి, సీనియర్ నాయకులు మర్రి మహేందర్రెడ్డి, బోళ్ల ఆంజనేయులు, వాకిటి వీరారెడ్డి, పార్టీలో చేరిన వారు శంకర్, రూప్సింగ్, రాము తదితరులు ఉన్నారు.