మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు. దీంతో ప్రజలు, వృద్ధులు, యువకులు కంటి వెలుగు శిబిరాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇప్పటి వరకు 4, 14,859 మందికి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1,97,075 మంది, మహిళలు 2,17,784 మంది ఉన్నారు. 38,609 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 38 వేల మందికి అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. బుధవారం 78వ రోజు జిల్లాలో 29 బృందాలు 4279 మందికి కంటి పరీక్షలు చేశాయి. 304 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 420 మందికి అద్దాలకు ఆర్డరిచ్చినట్లు డీఎంహెచ్వో చందునాయక్ తెలిపారు.
సంగారెడ్డి మే 17(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో బుధవారం 10,453 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 5228 మంది పురుషులు, 5226 మంది మహిళలు ఉన్నారు. గ్రామాల్లో 7725 మందికి, పట్టణాల్లో 2509, జీహెచ్ఎంసీలోని 219 మందికి కంటి పరీక్షలు చేశారు. వారిలో 449 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. 414 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు ఆర్డర్ చేశారు. కంటి సమస్యలు ఉన్న 388 మంది పురుషులు, 434 మంది మహిళలకు కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.