రాయపోల్, మార్చి 7: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ శంభుగుట్ట దేవాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని ముస్తాబు చేశారు. దౌల్తాబాద్తో పాటు సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.
ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఎతైన గుట్టపై స్వయంభూ లింగేశ్వరస్వామి వెలిశారు. 8న మహాశివవాత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పూజలు, రాత్రి 10 గంటలకు శ్రీపార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహిస్తారు. 9న శనివారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండాలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.