సదాశివపేట, నవంబర్ 28 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గొల్లగూడెంలో దళితబంధు లబ్ధిదారులైన ఆరుగురికి ఆయన గేదెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దళితుల కండ్లలో ఆనందం చూడడమే దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశమన్నారు.
గొల్లగూడెంలో 48 మంది లబ్ధిదారులకు వివిధ పథకాలు అందాయని, ప్రస్తుతం ఆరుగురుకి గేదెలను అందజేశామన్నారు. అనంతరం ఎస్డీఎఫ్ నిధులు రూ. 20లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను ఆయన ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, సొసైటీ చైర్మన్ రత్నాకర్రెడ్డి, ఎంపీడీవో పూజ, గొల్లగూడెం సర్పంచ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, ఏఈ కృష్ణ, ఎంపీటీసీ సునితా సుధాకర్, సంతోష్, సర్పంచ్లు లక్ష్మారెడ్డి, ఏస య్య, నరేశ్ గౌడ్, శేఖర్, శ్రీహరి, దశరథ్, సిద్దన్న, నాగుపల్లి శేఖర్, ఉప సర్పంచ్ శ్రీశైలం పాల్గొన్నారు.
హైటెక్ రెస్టారెంట్లో మాంసాహార భోజనం వికటించి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు. ఈ నెల 25న రాత్రి సదాశివపేట హైటెక్ హోటల్లో భోజనం వికటించి అస్వస్థకు గురై ప్రభు త్వ దవాఖానలో చికిత్స పొందుతున్న 42 మంది బాధితులను సోమవారం పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ పీ తొంట యాదమ్మ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొత్తగొల్ల ఆంజనేయులు, కౌన్సిలర్లు ఉన్నారు.