బ్యాంకుతో సంబంధం లేకుండా ఖాతాలో నగదు జమ
కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఈ పథకం ఉందా..?
ఏం ముఖం పెట్టుకుని బీజేపీ పాదయాత్రలు చేస్తున్నది
ధరలు పెంచి సామాన్యుడి నడ్డివిరుస్తున్న కేంద్రం
అందోల్ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మత్తుకు రూ.60కోట్లు
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు
మెదక్ జిల్లా హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులకు
యూనిట్ల పంపిణీ
దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దళితబంధుతో ప్రతి కుటుంబం తలరాతలు మారతాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులకు యూనిట్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. పది లక్షల సాయంతో నచ్చిన యూనిట్ను ఎంపిక చేసుకుని, లాభాలు పొంది మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది దళిత లబ్ధిదారులకు రూ.17,800కోట్లు బడ్జెట్లో కేటాయించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా దళితబంధు పథకాన్ని అమలు చేయడం లేదని, తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ పథకంపై అసత్యప్రచారాలు చేయడం సిగ్గు చేట్టన్నారు. దశాబ్దాల పాటు పాలించిన ఈ రెండు పార్టీలు వారిని ఓటు బ్యాంకుగానే చూశాయి తప్పా చేసిందేమీ లేదన్నారు. మోదీ సర్కారు ఏడేండ్ల పాలనలో గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచి సామాన్యుడిపై మోయలేని భారం మోపిందని అన్నారు. అంతకుముందు టేక్మాల్ పీహెచ్సీని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి దవాఖానాలో రోగులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అల్లాదుర్గం/టేక్మాల్, ఏప్రిల్ 17: దళిత కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించేలా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్థిక, ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీశ్రావు అన్నారు. దళిత బంధు పైలట్ ప్రాజెక్టులో భాగంగా టేక్మాల్ మండలంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మందికి ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, టెంట్ సామగ్రి, డీజే సౌండ్ సిస్టమ్, పాడి పరిశ్రమ, ఆటోట్రాలీని మంత్రి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ యూనిట్లతో ప్రతి లబ్ధిదారుడు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, తమ పిల్లలకు మంచిగా చదివించుకోవాలని కోరారు.
వచ్చే ఆదాయాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని, వ్యాపారాన్ని పొడిగించుకోవాలని సూచించారు. ఈ ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల దళిత లబ్ధిదారులకు రూ.17,800 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దళితులకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంచేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ నాయకులు ఏం మొఖం పెట్టుకుని రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకంపై అసత్యప్రచారాలు చేయడం సిగ్గు చేట్టన్నారు. బీజేపీ ఏడేళ్ల పాలనలో రూ.400 నుంచి రూ.1050కి గ్యాస్ ధర పెంచిందన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్కటి కూడా భర్తీ చేయలేని స్థితిలో ఉందన్నారు. త్వరలోనే 57 ఏండ్లు నిండిన వారికి రూ.2016 పింఛన్ అందజేస్తామన్నారు. అందోల్ నియోజకవర్గంలో బీటీ రోడ్ల మరమ్మతులకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నిధులు కేటాయించాలని కోరారని, దీంతో రూ.60 కోట్లు కేటాయించనున్నామని తెలిపారు.
మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం
సమాజంలో మహిళలకు సముచిత గౌరవం ఇచ్చినప్పుడే అభివృద్ధికి బాటలు పడుతాయని, మహిళాభివృద్ధే దేశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనూ మహిళలను గుర్తించిన దాఖాలాలు లేవని, కేవలం తెలంగాణలోనే గౌరవం ఇస్తున్నామని అన్నారు. రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మహిళాసాధికరాతకు అవకాశం వచ్చిందన్నారు. మహిళలకు ప్రతేక పథకాలు తీసుకొచ్చి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని మహిళలు, బాలింతలు తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండి ఆశీర్వాచనాలు అందజేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మహిళలను కోరారు.
– ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్
అభయహస్తం వాపసు చేసే ఆలోచనేదీ?
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన అభయహస్తం పథకం కాంగ్రెస్ పాలనలో మహిళా సంఘాలకు వాపసు చేసే ఆలోచనే రాకపోవడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో మహిళా సంఘాలను అదుకోడానికి అభయహస్తం నిధులు మిత్తితో కలిపి వాపసు చేసే కార్యక్రమం చేపట్టారన్నారు. మండుటెండలో కూడా ప్రతి ఇంటికి భగీరథ పథకంతో మంచి నీళ్లు అందిస్తున్నారని గుర్తుచేవారు. రాష్ర్టాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నది, మహిళలు గుర్తించాలని కోరారు. వేసవి కాలంలో కరెంటు కోతలతో దేశావ్యాప్తంగా సరఫరా అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో మాత్రం నిరంతర కరెంటు అందిస్తూ సాగు, తాగుకు ఢోకాలేకుండా నీళ్లందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు.
– డాక్టర్ యాదవరెడ్డి, ఎమ్మెల్సీ
జమ చేసిన సొమ్ము రెట్టింపుతో వాపసు
కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన అభయహస్తం నిధులకు రెట్టింపు చేసి చెల్లిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉండి చదువుకున్న మహిళలకు ప్రభుత్వం రుణాల రూపంలో ఆర్థికంగా ఎదిగేందుకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణనే అన్నారు. చదువుల నుంచి, ఆరోగ్య పరిరక్షణతో పాటు పెరిగి పెద్దయ్యాక కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా 116ల నగదును అందించి అదుకుంటున్నదన్నారు. సీఎం మహిళలను గౌరవిస్తున్న విషయం గురించి మాట్లాడే వారికి ఇదే నిదర్శనం కావాలన్నారు. అభయహస్తం పథకంలో జమ చేసిన నిధులకు వడ్డీతో కలిపి వాపసు చేసే ప్రక్రియను సీఎం ప్రారంభించడం సంతోషకరమని జడ్పీ చైర్పర్సన్ స్పష్టం చేశారు.
– మంజుశ్రీ, జడ్పీ చైర్పర్సన్ సంగారెడ్డి
సీఎం కేసీఆర్తోనే దళితుల అభివృద్ధి
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతోనే రాష్ట్రంలోని దళితులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ అన్నారు. దళితుల ఆర్థికాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసి దళిత బంధు పథకం లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో మాట్లాడుతూ.. అభయహస్తం నిధులు వాపస్ చేయడం సంతోషకరమని అన్నారు. ప్రతినెలా ప్రభుత్వానికి చెల్లించి, వయసు పైబడిన అనంతరం పింఛన్ రూపంలో ఇవ్వడం కన్నా పూర్తిగా తిరిగి వాపసు చేయడమే సులభమని గుర్తించిన సీఎం కేసీఆర్ మిత్తితో కలిపి ఇవ్వడం హర్షణీయమన్నారు. – బీబీపాటిల్, ఎంపీ, జహీరాబాద్
56మందికి దళితబంధు పథకం
దేశంలో ఎక్కడా లేనివిధంగా దళితులు ఆర్థిక స్వావలాంబన సాధించడానికి కృషి చే యాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ కోరారు. గ్రామంలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రైతులు ఉండడంతో ఎక్కువగా 23 డైయిరీ ఫాంలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చారన్నారు. 16 ట్రాన్స్పోర్టు వాహనాలు, ఆరు రిటేల్ వ్యాపారాలు, ఒక వరి కోత యంత్రం, టెంట్ హౌజ్ వంటి యూనిట్లు ఎంచుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో 1500మందికి ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే