హుస్నాబాద్, అక్టోబర్ 16: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి సనాదుల వివేక్ ప్రమాదవశాత్తు మృతి చెందాడని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనడం అర్థరహితంగా ఉందని మాల మహానాడుతో పాటు పలు దళిత సంఘాల నాయకులు అన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గురువారం హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు, పలు దళిత సంఘాలు, వివేక్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మంత్రి వైఖరికి నిరసనగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ ఎలక దేవయ్య మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నైలాన్ తాడుకు ఉరిపడి వివేక్ చనిపోయాడని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వివేక్ అనుమానాస్పద మృ తిపై ప్రత్యేక విచారణ జరిపించాలని, మృతికి కారకులైన వారికి కఠినంగా శిక్షించాలని డి మాండ్ చేశారు. వివేక్ను చంపి ప్రమాదవశాత్తు చనిపోయాడని చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.
పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు చెబుతున్న కట్టుకథకు వివేక్ మృతి చెందిన ఆనవాళ్లకు ఎలాంటి సంబంధం లే కుండా ఉన్నదన్నారు. ఇప్పటి వరకు ఎంక్వైరీ కమిటీని వేయకపోవడం అన్యాయం అని ప్రశ్నించారు.మంత్రి పొన్నం వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని వివేక్ కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే ఆందోళనలకు మం త్రి పొన్నం, జిల్లా అధికారులు బాధ్యత వ హించాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిప త్రం అందజేశారు.ఆందోళనలో వివేక్ తల్లిదండ్రులు లావణ్య, సత్యనారాయణ, జాతీయ మాల మహానాడు నియోజకవర్గ ఇన్చార్జి ఆరె కిశోర్, మాజీ కౌన్సిలర్ బొజ్జ హరీశ్, దళిత సంఘాల నాయకులు మాంకాల రమేశ్, సానాది లక్ష్మణ్, సానాది యాదగిరి, గుమ్మడి సాయిశ్రీరామ్, వివేక్ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.