గజ్వేల్, జూలై 4 : హరితహారంలో నాటిన మొక్కలు నేడు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి. చిన్న మొక్కలు నేడు ఏపుగా పెరిగి వృక్షాలుగా మారాయి. గత ఆరేండ్ల క్రితం నాటిన మొక్కలను సంరక్షించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు చొరవ తీసుకున్నారు. దీంతో విద్యార్థులకు పచ్చదనంతో పాటు మంచి వాతావరణం కనిపిస్తున్నది. గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్ మదర్సా పాఠశాలలోకి ప్రవేశించగానే అందరిని హత్తుకునే వాతావరణం కనిపిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహరంతో నేడు పట్ణణాలు, గ్రామాల్లో పచ్చదనం ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేర్చే విధంగా విద్యాసంస్థల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్ మదర్సా పాఠశాలలో చైర్మన్ హైదర్ పటేల్ ప్రత్యేక కృషి ఫలితంగా నేడు విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి వచ్చింది. వందలాది మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. మొక్కల సంరక్షణ కోసం రోజూ వృథాగా పొతున్న నీటిని ఒడిసిపట్టి మొక్కలకు వినియోగిస్తున్నారు. వృథా నీటిని చెట్ల మధ్యలో చెరువులాగా ఇంకుడు గుంత ఏర్పాటు చేసి అందులోకి వదులుతున్నారు. గుంతలోకి చేరిన నీటిని రిసైక్లింగ్ చేసేందుకు బాతులు పెంచుతున్నారు. పదుల సంఖ్యలో బాతులు చెట్ల మధ్య తిరుగుతున్నాయి. పాఠశాల ఆవరణం శుభ్రంగా కనిపిస్తున్నది. పాఠశాల ఆవరణలో మామిడి, దానిమ్మ, సపోట, జామ మొక్కలతో పాటు ఇతర మొక్కలు పెంచారు.
అందరి కృషి ఫలితంగా మొక్కల పెంపకం
పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులందరి కృషి ఫలితంగానే మొక్కలు పెంచాం. సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా మొక్కలను పెంచడంతో ఎంతో సంతృప్తి కలుగుతున్నది. పాఠశాల ఆవరణలో సగభాగం రాయిబండ ఉండగా దానిపై మట్టి పోసి మొక్కలు పెంచుతున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, యాజమాన్యం కృషి ఫలితమే నేడు ఆవరణలో కనిపిస్తున్న మొక్కల
– హైదర్పటేల్, మదర్సా పాఠశాల చైర్మన్