హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటా పోటీ నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా లోక్ భవన్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
మహేష్ గౌడ్, మంత్రులు, పొంగులేటి దామోదరను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, కాంగ్రెస్ నిరసనకు పోటీగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.