పాపన్నపేట, ఆగస్టు14 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధిలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొంత కాలంగా పెద్ద ఎత్తున వర్షాలు పడడం, వరదలు రావడం మూలంగా.. వనదుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి పూజలు నిర్వహించారు.
ఎట్టకేలకు శనివారం సాయంత్రం వరద తగ్గడంతో అమ్మవారి ఆలయాన్ని పునఃప్రారంభించారు. దీంతో చాలా కాలం తర్వాత ఆదివారం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఇదిలావుండగా భఖ్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు.