రామాయంపేట, మార్చి 18: రామాయంపేట మండలంలోని డి.ధర్మారం, రాయిలాపూర్ గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. రామాయంపేట పట్టణంలో ఈదురు గాలులతో జనం ఇబ్బంది పడ్డారు. డి.ధర్మారం, రాయిలాపూర్లో వడగండ్ల వాన గంటపాటు కురిసింది. వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. అక్కన్నపేట గ్రామంలో ఈదురు గాలులకు ట్రాక్టర్పై చెట్లు విరిగి పడ్డాయి.