మెదక్ రూరల్ జనవరి 16 : పేద ప్రజలకు సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ జిల్లా కార్యదర్శి ఖలేక్ అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18 న ఖమ్మంలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు 40 దేశాల నుంచి కమ్యూనిస్టుల ప్రతినిధులు హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. సీపీఐ కార్యకర్తలు, కార్మికులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ గౌడ్, దినకర్ రాజు ,ఎర్రదాస్, పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.