సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 14 : జిల్లాలో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి/ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు జిల్లాలో 2 పరీక్షా కేంద్రాల వద్ద ఈ నెల 16 నుంచి 26 వరకు ఉదయం 6 నుంచి సాయం త్రం 6 గంటల వరకు అమలులో ఉంటుందన్నారు.
కేంద్రాల నుం చి 500 మీటర్ల వరకు ప్రజలు గుమికూడవద్దన్నారు. పరీక్షల సమయంలో పోలీసు అధికారులు పెట్రోలింగ్ చేయాలని ఆదేశించారు. పరీక్షా సమయానికి గంట ముందు చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. గవర్నమెంట్ హైస్కూల్ పారుపల్లి స్ట్రీట్ (ఎస్ఎస్సీ), గవర్నమెంట్ హైస్కూల్ మెదక్ రోడ్ సిద్దిపేట (ఇంటర్మీడియెట్ పరీక్షలకు) కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.
– మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా
పాపన్నపేట, అక్టోబర్ 14: ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షా సూచించారు. శనివారం మండలంలోని మల్లంపేటలోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఎన్నికల విధులు విస్మరించిన మండల రెవెన్యూ కార్యాలయానికి చెందిన ఎన్నికల సూపర్వైజర్ రాధాకృష్ణను సస్పెండ్ చేయాలని ఆర్డీవోను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన పోలింగ్ బూత్ల వద్ద మౌలిక సదుపాయాలు, ఓటరు జాబితాలను పరిశీలించారు. ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యవంతం చేయాలన్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించడంతో అధికారి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడతానన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంట స్థానిక తహసీల్ధార్ లక్ష్మణ్ బాబు, పీఆర్ఈఈ నర్సింలు,స్థానిక సర్పంచ్ బాపురెడ్డి తదితరులు ఉన్నారు.