సిద్దిపేటరూరల్,అక్టోబర్21: పూలను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి అని సిద్దిపేట సీపీ ఎన్.శ్వేత అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ ఆవరణంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజూ ఉద్యోగ బాధ్యతల్లో ఉండే మహిళా సిబ్బందిలో బతుకమ్మ వేడుకలు సంతోషాన్ని నింపాయన్నారు. బతుకమ్మ వేడుకలు సిబ్బందితో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
సంబురాల్లో కలెక్టర్ సతీమణి జ్యోతి, అడిషినల్ కలెక్టర్ గరిమాఅగర్వాల్, ఏవో యాదమ్మ, మహిళా పోలీస్స్టేషన్ సీఐ దుర్గ, ఎస్సైలు అపూర్వ, పుష్ప, మహిళా ఏఎస్సైలు సువర్ణ, పరమేశ్వరి, హెడ్కానిస్టేబుళ్లు స్వాతి, భాగ్య, మహిళా కానిస్టేబుళ్లు, కమిషనర్ కార్యాలయ మహిళా సిబ్బంది, షీటీం, భరోసా, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.