సిద్దిపేట, ఫిబ్రవరి 28 : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలిరోజు సజావుగా ఇంటర్ పరీక్ష జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు సజావుగా జరిగాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 11,039 మంది విద్యార్థులు పరీక్షా రాయవలసి ఉం డగా, 10,328 మంది విద్యార్థులు హాజరయ్యారు. సిద్దిపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధ్దంగా పరీక్ష కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు నిరాశగా వెనుదిరిగారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎ లాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జనరల్ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 8,864 మందికి గానూ 8,419 మంది హాజరుకాగా, 445 మంది గైర్హజరయ్యారు. జనరల్ ఇంటర్ విద్యార్థులు 95 శాతం హాజరయ్యారు. ఇంటర్ ఒకేషనల్ 2,127 విద్యార్థులకు 1,909 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది విద్యార్థులు గైర్హజరయ్యారు. మొత్తంగా తొలి రోజు 94 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని బాలికల జూనియర్ కాలేజీ, ప్రగతి ఒకేషనల్ కాలేజీ, న్యూనరేషన్ జూనియర్ కాలేజీ ,టీఎస్డబ్ల్యూఆర్జేసీ కాలేజీ ఎన్సాన్పల్లి సెంటర్లను ఇంటర్ విద్యాధికారి సూర్య ప్రకాశ్ సందర్శించారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సిద్దిపేట పట్టణంలో పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి మానిటర్ చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలో ఉంది.