మెదక్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మెదక్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కండ్లు తెరవాలని, కాంగ్రెస్ పార్టీలో 15 ఏండ్లుగా ప్రతి కార్యకర్తకూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరిస్తున్నా పార్టీ గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 5వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, 15 సంవత్సరాలుగా కా్రగ్రెస్ పార్టీలో అనేక కష్ట,నష్టాలను అనుభవిస్తూ, ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేశానని చెప్పారు. ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం టీపీసీసీ కోఆప్షన్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం కార్యకర్తల నుంచి రూ.50వేల రుసుమును మెదక్ నియోజకవర్గం నుంచి 11మంది నుంచి తీసుకొని కనీసం ఒక్క కార్యకర్తకు కూడా ఫోన్ చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లీలో ఉండే కాంగ్రెస్ ఓట్లను, ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ నాయకులు నోట్లు గా మార్చుకోవడం కాంగ్రెస్ విధానంగా మారిపోతుందని తెలిపారు. రాజకీయం అనుభవం లేని యువకుడికి అభ్యర్థ్ధిగా అవకాశం ఇవ్వడం బాధాకరమన్నారు.
త్వరలో బీఆర్ఎస్లో చేరిక
త్వరలో బీఆర్ఎస్లోకి భారీఎత్తున చేరికలు ఉంటాయని ఆంజనేయులు తెలిపా రు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఎ మ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఎంతో అభివృ ద్ధి చేస్తున్నారని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై బీఆర్ఎస్లోకి వెళ్లడం ఖాయమన్నారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సుఫీ, శ్రీనివాస్, మడూరి చంద్రమోహన్గౌడ్, సారా శ్యాంసుందర్ పాల్గొన్నారు.