మెదక్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించడంలో జిల్లా సహకార శాఖ ఉద్యోగుల సేవలు అభినందనీయమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. మంగళవారం మెదక్లోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధాన్యం సేకరణతో పాటు ప్రాథమిక వ్యవసా య పరపతి, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులు, పాల ఉత్పత్తిదారులు, గీత పారిశ్రామిక సహకార సంఘాల ఎన్నికల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అంది స్తూ.. అటు అధికారులు, ఇటు ప్రజల మన్ననలు పొందిన ఘనత సహకార శాఖ ఉద్యోగులకే దకుతుందన్నారు.
అనంతరం సహకార శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామగౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్గౌడ్, జిల్లా సహకార శాఖ అధికారి కరుణతో కలిసి ఆవిషరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, మాజీ అధ్యక్షుడు శ్యామ్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా సహకార ఆడిట్ అధికారి కరుణాకర్, సహకారశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సంగమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, ఉద్యోగులు యాకూబ్అలీ, భరత్ కృష్ణ, పూర్ణచందర్, రాజేశ్, తుకారం పాల్గొన్నారు.