మెదక్ : కంట్రోల్ రూమ్లో అధికారులు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండి సమాచారం తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ఈ మేరకు మెదక్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కంట్రోల్రూమ్ను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు, విపత్కర పరిస్థితులు ఉన్నట్లయితే కంట్రోల్రూమ్ ఫోన్నెంబర్లు 08452–223360, 9391942254 లకు ఫోన్ చేయాలన్నారు.
రెండు షిఫ్టులలో కంట్రోల్రూమ్లో సిబ్బంది ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.