నర్సాపూర్, నవంబర్ 6: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత తండ్లాడినా 30 సీట్ల కంటే ఎక్కువ రావని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం ఎద్దేవా చేశారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారన్నారు. 2014 తర్వాత భూములు రేట్లు బాగా పెరిగాయని, పంటలు పుష్కలంగా పండుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే కురుమలు ఎక్కువ లబ్ధి పొందారన్నారు. కురుమలు ఆర్థికంగా ఎదగడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గొర్రెలను పంపిణీ చేశారన్నారు. తెలంగాణలో అమలుచేసిన పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేయడం ఆ ముఖ్యమంత్రులకు సాధ్యపడడం లేదన్నారు. కురుమలు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో సునీతాలక్ష్మారెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డిని ఎంపీగా గెలుపించుకుందామన్నారు. కురుమలు సునీతాలక్ష్మారెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కురుమలకు రాజకీయంగా మంచి ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ మిగతా రాష్ర్టాల కంటే అన్ని విధాలా అభివృద్ధి చెందిందన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఆత్మహత్యలు ఉండేవని, తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా తగ్గిపోయాయని వెల్లడించారు. కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కురుమల ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉన్నదని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు పుష్పా నగేశ్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు, ఎంపీపీ నర్సింహులు, కురుమ సంఘ నాయకులు రవీందర్యాదవ్, శ్రీశైలం పాల్గొన్నారు.