ఒకప్పుడు నెర్రెలు బారిన నేలల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. వర్షాల కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసే రోజులు పోయి సీఎం కేసీఆర్ కృషితో ఏడాదంతా పుష్కలంగా సాగునీరు లభిస్తున్న పరిస్థితి వచ్చింది. నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం, హత్నూర, వెల్దుర్తి, మాసాయిపేట్, చిలిపిచెడ్ మండలాల్లో ప్రవహిస్తున్న మంజీరా నది, హల్దీవాగుపై రూ. 67.44 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న 13 చెక్డ్యామ్లు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇప్పటికే 10 చెక్డ్యామ్లు పూర్తి కాగా, మరో మూడు చోట్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దశాబ్దాల పాటు కరువుతో గోసపడిన ఈ ప్రాంతం నేడు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా మారింది.
– నర్సాపూర్, సెప్టెంబర్ 12
నర్సాపూర్, సెప్టెంబర్ 12 : దండగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారు. బీఆర్ఎస్ హయాంలో పు ష్కలంగా సాగు నీరు, రైతుబంధు సాయం, విరివిగా యూరి యా అందిస్తుండడంతో తెలంగాణ రైతులు పాడిపంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు నెర్రలు బారిన నేలలు నేడు బంగారు పంటలు పండి రైతన్నలకు సిరులు కురిపిస్తున్నాయి. నియోజకవర్గంలో మంజీరా నది, హల్దీ వాగుల్లో నీరు పారుతున్నా చెక్డ్యామ్లు నిర్మించి సాగు నీరందించడంలో గత పాలకులు విఫలమయ్యారు. నదుల పరీవాహక ప్రాంతాల్లో నీళ్లున్నప్పటికీ చెక్డ్యామ్లు లేక, నీరు నిల్వకాక పంటలు ఎండిపోయేవి. ఎండాకాలం వచ్చిందంటే భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్ మోటర్లు ఆగిపోయేవి. కానీ బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మంజీరా, హల్దీవాగుపై చెక్డ్యామ్లను నిర్మించి నీటిని నిల్వచేసి పొలాలకు సాగునీరు మళ్లించి పరీవాహక ప్రాంతాలను సస్యశ్యామలం చేశారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో 13 చెక్డ్యామ్ల నిర్మాణం
నర్సాపూర్ నియోజకవర్గంలోని కొల్చారం, హత్నూర, వెల్దుర్తి, మాసాయిపేట్, చిలిపిచెడ్ మండలాల్లో ప్రవహిస్తున్న మంజీరా నది, హల్దీ వాగుపై రూ.67.44 కోట్లతో 13 చెక్డ్యామ్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఇందులో 10 చెక్డ్యామ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో మూడు నిర్మాణంలో ఉన్నవి. వెల్దుర్తి, మాసాయిపేట్ మండలాల మీదుగా హల్దీ వాగు.. హత్నూరా, చిలిపిచెడ్ మండలాల నుంచి మంజీ రా నది.. కొల్చారం మండలంలో హల్దీ, మంజీరా నది ప్రవహిస్తున్నాయి. వర్షాకాలంలో నదుల్లోని నీరు వృథాగా పోనివ్వకుండా పంట సాగుకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో చెక్డ్యామ్లను నిర్మించారు. చిలిపిచెడ్ మండలంలోని అజ్జమర్రి, చిట్కూల్ గ్రామాల సమీపంలో ప్రవహిస్తున్న మంజీరా నదిపై చెక్డ్యామ్ను నిర్మాణం పూర్తైంది. ఫైజాబాద్, చండూర్ గ్రామాల వద్ద చెక్డ్యామ్లు నిర్మాణంలో ఉన్నాయి. కొల్చారం మండలంలోని కొంగోడు సమీపంలో హల్దీవాగుపై చెక్డ్యామ్ నిర్మాణం పూర్తైంది. ఎనగండ్ల, పైతర గ్రామాల్లో మంజీరా నదిపై చెక్డ్యామ్ల నిర్మాణం పూర్తి కాగా, కోనాపూర్ చెక్డ్యామ్ నిర్మాణంలో ఉంది. హత్నూర మండలంలోని రెడ్డిఖానాపూర్, పన్యాల శివారులో మంజీరా నదిపై రెండు చెక్డ్యామ్లు నిర్మించారు. వెల్దుర్తి, మాసాయిపేట్ మండలాల్లోని గంగమ్మ దేవాలయం, ఉప్పలింగాపూర్, దామరంచ శివారుల్లో హల్దీవాగుపై మూడు చెక్డ్యామ్లు పూర్తయ్యాయి. చెక్డ్యామ్ల నిర్మాణంతో నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. ఎండాకాలంలో సైతం బోర్లు ఆపకుండా నీళ్లు పోస్తున్నాయి. పంటలు ఎండిపోయాయనే మాటే లేదని, ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు పైప్లైన్ ద్వారా చెక్డ్యామ్ల నుంచి నీటిని పంటల సాగుకు వినియోగించుకుంటున్నారు. గతంలో కంటే చెక్డ్యామ్ల నిర్మాణంతో పంటల దిగుబడి పెరగగా, వానల కోసం ఎదురుచూడకుండా రైతన్నలు సాఫీగా వ్యవసాయం చేసుకుంటున్నారు.
నీటి కష్టాలు తీరిపోయాయి
వాగుపై చెక్డ్యామ్లు కట్టడంతో పంటలకు నీటి కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు వర్షాల కోసం ఎదురుచూడకుండా సంతోషంగాఎవుసం చేసుకుంటున్నాము. చెక్డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయి. గతంలో వానకాలంలో భారీగా వర్షాలు కురిసి వాగులో నీరు వృథాగా పోయేది. నేడు చెక్డ్యాముల్లో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. వానలు పడితేనే వానకాలంలో వరి పంటలు వేసేవాళ్లం.. యాసంగి బోరు బావుల వద్ద కొంత మేర పంటలను వేసేవాళ్లం. కానీ నేడు కాళేశ్వరం నీరు కూడా చెక్డ్యామ్ల్లో నిండిపోవడంతో యాసంగిలో కూడా పంటలు బాగా పండిస్తున్నాం. మా గోస తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు.
-మహేందర్రెడ్డి, రైతు, ఆరెగూడెం, వెల్దుర్తి
రైతు రాజ్యమే ముఖ్యమంత్రి ధ్యేయం
రైతు రాజు కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయం. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడు అయ్యాడు. మంజీ రా నది, హల్దీవాగులపై చెక్డ్యామ్లు నిర్మించి రైతుల కష్టాలు తీర్చాం. నేడు రైతులు సంతోషంతో రెండు పంటలు వేసి అధిక దిగుబడి సాధిస్తున్నారు. మిగతా చెక్డ్యామ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ను రైతన్నలు ఎల్లప్పుడు ఆశీర్వదించాలి.
-ఎమ్మెల్యే మదన్రెడ్డి, నర్సాపూర్