అందోలు, అక్టోబర్ 8 : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటకు బీటలు వారుతున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పేర్కొ న్నారు.
ఆదివారం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సమక్షంలో అల్మాయిపేట్ సర్పంచ్ బాలమణీరవిశంకర్, పోసానీపేట్ ఎంపీటీసీ ఉమారాణీసురేందర్, అల్మాయిపేట్లో వార్డు సభ్యులు వీరేశం, భిక్షపతితోపాటు 200మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరా రు. వీరితోపాటు 2018లో బీఎస్పీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన బుచ్చయ్య బీఆర్ఎస్లో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ అందోలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చోటులేదు, బీఆర్ఎస్కు తిరుగులేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో సరైన గౌరవం లేక, వలసవాదుల పెత్తనంలో పనిచేయలేక ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఆత్మగౌరవం, అభివృద్ధికి బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్లో అందరికీ సముచిత స్థానం ఇస్తామని, అందోలు గడ్డ పై గులాబీ జెండా ఎగరవేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.
ముందుగా భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతి, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పల్లె సంజీవయ్య, ఎంపీపీ బాలయ్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్రెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, నాయకులు రాజుముదిరాజ్, శంకర్గౌడ్, జహంగీర్రెడ్డి, సర్పంచ్లు ప్రవీణ్రెడ్డి, లింగాగౌడ్, అనిల్రెడ్డి, నరేందర్రెడ్డి, బీఆర్ ఎస్ పుల్కల్ మండలాధ్యక్షుడు విజయ్కుమార్ పాల్గొన్నారు.