మోసపోతే గోస పడతాం.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ పార్టీకి ఓటు వేసి మూడోసారి విజయం అందించాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ప్రజలను కోరారు. ఆదివారం పుల్కల్ మండలం ఎస్ ఇటిక్యాలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో డ్రైనేజీ, చర్చి ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్సోళ్లు ఆరు కాదు.. అరవై పథకాలు ప్రకటించినా గెలిచే అవకాశం లేదన్నారు. తెలంగాణ రాకముందు.. వచ్చాక పల్లెలు ఎలా ఉన్నాయో ఆ పార్టీ నాయకులు తెలుసుకోవాలన్నారు. బీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో దళిత సంఘాలకు చెందిన వివిధ మండలాల నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ చేరారు. సమావేశం అనంతరం గ్రామానికి చెందిన 418 మంది లబ్ధిదారులకు ఇనాం భూముల పట్టాలు అందజేశారు.
– పుల్కల్, సెప్టెంబర్ 24
పుల్కల్, సెప్టెంబర్ 24: కాంగ్రెసోళ్లు ఆరు కాదు, అరవై పథకాలు పెట్టినా గెలువరని, ప్రజల్లో ఆదరణ కోల్పోయారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మోస పోతే గోస పడతామని, ఆలోచించి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు. ఆదివారం మండలంలోని ఎస్ ఇటిక్యాల గ్రామంలో పార్టీ శ్రేణుల సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం గ్రామంలో చర్చి ప్రహరీ నిర్మాణానికి, డ్రైనేజీ నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేకు బీఆర్ నాయకులు క్రేన్ సహాయంతో గజమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ చేరికల జోరు పెరిగింది. కాంగ్రెస్ నుంచి దళిత సంఘాలకు చెందిన వివిధ మండలాల నాయకులు కుమార్, సూర్యకుమార్, దేవదాస్, చింత రమేశ్, మ్యాథరి బాలరాజు, శ్రీకాంత్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి బీఆర్ ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ కంటి మీద కునుకు లేకుండా రోజూ ఏదో చోట కాంగ్రెస్ నుంచి బీఆర్ భారీగా చేరుతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. పదేళ్ల క్రితం గ్రామాలు ఏవిధంగా ఉండే, ప్రస్తుతం ఎలా ఉన్నాయో కాంగ్రెసోళ్లు కండ్లు తెరిచి చూడాలన్నారు. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.60 లక్షలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయించిన ఘనత బీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్థానిక నాయకత్వం బలపడాలంటే మళ్లీ తనకే అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీ వెళ్లి పోరాడిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఎర్రోళ్ల పోచయ్య తన అనుచరులతో పార్టీలో చేరడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే కొనియాడారు.ఎర్రోళ్ల పోచయ్య మీ గ్రామానికి చెందిన వాడు కావడం అదృష్టంగా భావించాలన్నారు.
418 మందికి ఇనాం భూముల పట్టాలు అందజేత
అనంతరం ఎస్ ఇటిక్యాల గ్రామానికి చెందిన 418 మంది లబ్ధిదారులకు ఇనాం భూముల పట్టాలను ఎమ్మెల్యే అందజేశారు. వచ్చే ఏడాది నుంచి రైతు బంధు తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు జైపాల్ ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, నాయకులు చంటి రాహుల్ కిరణ్, పైతర సాయికుమార్, పల్లె సంజీవయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల విజయ్ చౌటకూర్ మండల అధ్యక్షుడు శివకుమార్, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కిష్టారెడ్డి, గ్రామ సర్పంచ్ మన్నె రాధయ్య, సర్పంచ్ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.