తూప్రాన్, ఫిబ్రవరి 26: మున్సిపల్ కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్పై ఇటీవల కాంగ్రెస్లో చేరిన కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. అవిశ్వాసానికి మద్దతు తెలుపాలంటూ పలువురు కౌన్సిలర్లను దాడు లు, కేసులతో బెదిరిస్తున్నారని తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సోమవారం వారు తూప్రాన్కు వచ్చా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన కోరం సరిపోకపోవడంతో 2వ వార్డు కౌన్సిలర్ మామిడి వెంకటేశ్ను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు.
అతడు తిరిగి బీఆర్ఎస్లోకి రాగా, కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకులు అతడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇంటిని కూల్చివేస్తామని కమిషనర్ ద్వారా నోటీసులు పంపడంతో పా టు వృద్ధులైన వెంకటేశ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలను వేధిస్తున్నారని తెలిపారు. 8వ వార్డు కౌన్సిలర్ లావణ్యా దుర్గారెడ్డికి చెందిన ఇటుక బట్టీలను కూల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని, దాడులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం కౌన్సిలర్ మామిడి వెంకటేశ్ కుటుంబాన్ని, ధ్వంసం చేసిన లావణ్యా దుర్గారెడ్డికి చెందిన ఇటుక బట్టీలను వారు పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధా న కార్యదర్శి ఏర్పుల లక్షణ్, పార్టీ మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, గజ్వేల్ జడ్పీటీసీ మల్లేశం, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, నాయకులు దుర్గారెడ్డి, సత్యలింగం, వెంకట్ గౌడ్, గంగాధర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.