మెదక్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): జిల్లా అన్ని రంగాల్లో నంబర్వన్గా నిలుస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పర్యావరణానికి ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిషరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.
ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ బాలస్వామి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి లక్ష్మీశారద, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.