టేక్మాల్, ఏప్రిల్ 23: హామీలు నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బొడ్మట్పల్లి గ్రామంలో మంగళవారం పర్యటించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఆయనతో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
రేగోడ్, ఏప్రిల్ 23: రేగోడ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రోడ్ షోలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు. బీఆర్ఎస్కు ఓటేయాలని అభ్యర్థించారు. ఆయన వెంట శాసనసభ మాజీ స్పీకర్, ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అందోల్ మాజీ ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్, నాయకుడు జైపాల్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.