మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 24: జిల్లాలో వంద శాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకెళ్లాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సాధారణ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా శుక్రవారం ఐడీవోసీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పద్ధ్దతిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నవంబర్ 30న ఓటర్లు తమకు కేటాయించిన పోలిం గ్ కేంద్రాల్లోకి వెళ్లి స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.