ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ అన్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాట్ల ర్యాండమైజేషన్ చేపట్టినట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎస్పీ రూపేశ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పీ అశోక్, డీఆర్వో నగేశ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని వందశాతం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రూ.1.61 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. 15 ఫ్లయింగ్ స్కాడ్లు, రాష్ట్ర సరిహద్దుల్లో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జిల్లాలో ఈవీఎం, వీవీప్యాడ్ల ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈవీఎం, వీవీప్యాడ్ల ర్యాం డమైజేషన్ చేపట్టినట్లు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ఎస్పీ రూపేశ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పీ అశోక్, డీఆర్డీవో నగేశ్తో కలిసి శుక్రవారం విలేకరులతో కలెక్టర్ శరత్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల నియమావళి పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగదు రవాణా జరుగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు రూ.1.61 కోట్ల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. పోలీసుశాఖతోపాటు ఎన్నికల బృం దాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వివ రించారు. కర్ణాటక సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లాలో గత ఎన్నికల సమయంలో ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తే ప్రస్తు తం తొమ్మిది చెక్పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో పకడ్బందీగా అమ లు చేసేందుకు 15 ఫ్లయింగ్ స్కాడ్లు ఏర్పాటు చేశామని, ప్రతి నియోజకవర్గం లో 3 ఫ్లయింగ్ స్కాడ్లు పని చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులు నిబంధలన మేరకు ఎన్నికల్లో ఖర్చు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఖర్చును పరిశీలించడా నికి జిల్లాస్థాయిలో కమిటీ వేసినట్లు వివరించారు. జిల్లాలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 1594 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి శరత్ హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎస్పీ చెన్నూరి రూపేశ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా లో ఇప్పటి వరకు రూ.1.61 కోట్లు సీజ్ చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 180 కేసులు నమోదు చేశామని తెలిపారు. రూ.13.52 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటివరకు 1219 మం దిని బైండోవర్ చేశామని, మరో 1000 మందిపై నిఘా వేశా మని, వారిని త్వరలోనే బైండోవర్ చేస్తామని తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు.