మెదక్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ ఇష్రత్ (ఏఐఎంఐఎం), గౌస్ ఖురేషి (బీఆర్ఎస్), ఆంజనేయులుగౌడ్ (కాంగ్రెస్), కె.నర్సిం హులు (బీఎస్పీ), బస్వరాజ్ (సీపీఎం), ఎండీ అఫ్జల్(టీడీపీ)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రాజర్షిషా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 4,34,900 మంది ఓటర్లున్నారని, వీరి కోసం 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు 25శాతం, వీవీ ప్యాట్లను 40 శాతం అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. మొదటి ర్యాండమైజేషన్లో ప్రత్యేక సాఫ్ట్ట్వేర్ ద్వారా నియోజకవర్గం, పోలింగ్ కేం ద్రాల వారీగా యంత్రాల కేటాయింపు పూర్తి చేస్తామన్నారు.
శనివారం ఉదయం 9 గంట లకు ఏవీఏం గోదాంలో నియోజకవర్గం వారీగా జనరేట్ చేసిన జాబితా ప్రకారం కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తామని తెలిపారు. రెండో దఫాలో ఎన్నిక అధికారులు, ఎన్నికల సహాయ అధికారులు, పోలింగ్ సిబ్బంది కేటాయింపు, మూడో ర్యాండమైజేషన్లో కంట్రోల్ యూ నిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ల సామగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించ డానికి సిద్ధం చేస్తామన్నారు. పోలింగ్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని పార్టీల ప్రతినిధులకు సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు, వాహనాలు, సభ లు, సమావేశాలు ఏర్పాట్లు, డబ్బు పంపిణీ సమాచారం తమకు అందించాలని సూచిం చారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య వార్తలపై అప్రమత్తం ఉండాలని, అభ్యంతరకర పోస్టులు ఉండరాదని హితవు పలికారు. సమావేశంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.