వందశాతం ఓటింగ్ లక్ష్యంతో పనిచేయాలని మెదక్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ మండలంలోని రాజ్పల్లిలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు వేయడానికి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు నమోదుకు ఈనెల 31వరకు అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వీవీ ప్యాండ్లపై అవగాహన కల్పించడానికి సంచార ప్రదర్శన వాహనం మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో తిప్పుతున్నట్లు తెలిపారు. ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను’ అనే నినాదంతో ప్రజలందరూ ఓటింగ్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మెదక్ రూరల్, అక్టోబర్ 19: 100 శాతం ఓటింగ్ లక్ష్యంతో అధికారులు పని చేయాలని మెదక్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. గురువారం మెదక్ మండలంలోని రాజ్పల్లి దాయారలో ఓటరు నమోదుపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఓటేయడానికి అధికారులు చైతన్యపర్చాలన్నారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వియోగించుకోవాలని, ప్రలోభాలకు లోను కాకూడదని, ఓటు బ్రహ్మాస్త్రమని తెలిపారు. ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే ఈ నెల 31 తేదీ వరకు అవకాశం ఉన్నదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించడానికి సంచార ప్రదర్శన వాహనం మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదన్నారు. అనంతరం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను డబ్బు, మద్యం బహుమతుల వంటి ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తే చట్టరీత్యా నేరమన్నారు. ఎన్నికల ప్రచారంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్ వాడడం, ఇతర నిబ్బంధనలు ఉల్లాఘిస్తే సీ విజిల్ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చున్నారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చనారు. సమావేశంలో పీడీ మోప్మా ఇందిర, జిల్లా సైన్స్ అధికారి రాజారెడ్డి, ఆర్డీవో, అంబాదాస్ రాజేశ్వర్, సర్పంచ్ ప్రేమలత, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, నాయకుడు ఎలక్షన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.