సిద్దిపేట, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పని చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పిలుపునిచ్చారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరై జాతీయ జెండాను ఆవిషరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి, ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి, జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేయాలన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ సూల్ ఎంసాన్పల్లి, ప్రభుత్వ బాలికల హైసూల్ సిద్దిపేట, రాఘవపూర్ కేజీబీవీ విద్యార్థులు దేశభక్తి గేయాలపై చేసిన డాన్సులు అలరించాయి. కార్యక్రమంలో సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సీపీ డాక్టర్ అనురాధ, జిల్లా అదనపు కలెక్టర్లు గరీమాఅగ్రవాల్, శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.