కొండపాక, నవంబర్ 23 : మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏజెన్సీలకు సూచించారు. బుధవారం మండలంలోని తిప్పారం, మంగోల్ గ్రామాల పరిధిలోని మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథకు అందాల్సిన రా-వాటర్ పంప్హౌస్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ అధికారులు మల్లన్నసాగర్ నుంచి వాటర్ పంప్ అయ్యే విధానాన్ని మ్యాప్ను చూప్తిస్తూ కలెక్టర్కు క్లుప్తంగా వివరించారు. పంపుహౌస్ లోపల కలియ తిరుగుతూ మోటర్లు పనిచేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం 5.6 కిలోమీటర్ల దూరంలో మంగోల్ శివారులో నిర్మిస్తున్న ఫిల్టర్బెడ్ను పరిశీలించారు. వాటర్ ఫిల్లర్ అయ్చే విధానాన్ని మ్యాప్ పాయింట్గా అధికారులు కలెక్టర్కు తెలిపారు. రెండు ఫిల్టర్ గ్రిడ్ల్ ద్వారా 540 మిలియన్ల లీటర్ల నీరు ఫిల్టర్ అవుతాయని అధికారులు వివరించారు. గజ్వేల్, జనగాం, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ ప్రాంతాలకు మిషన్ భగీరథ అనుసంధానం అవుతాయని అధికారులు వివరించారు. కలెక్టర్ వెంట డీఎఫ్వో శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు సీఈ విజయ్ ప్రకాశ్, ఎస్ఈ శ్రీనివాస్చారి, ఈఈ రాజయ్య, డీఈ నాగార్జునరావు, తహసీల్దార్, సర్పంచ్ కిరణ్కుమార్, రమేశ్రెడ్డి, కనకయ్య, కరుణాకర్ ప్రజాప్రతినిధులు ఉన్నారు.