సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 28: అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చొర వ చూపాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి సమస్యలు విన్నవించుకోవటానికి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే విధంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సం బంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్లపై 19 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, డీఆర్వో నాగరాజమ్మ, అధికారులు పాల్గొన్నారు.