సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 27 : జిల్లాలో హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మంజూరైన గ్రామపంచాయ తీ భవన నిర్మాణ పనులను ఈ నెల 30లోగా ప్రారంభించాలని సంబంధితశాఖల అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, విద్య, వెనుకబడిన తరగతు లశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవో లు, మున్సిపల్ కమిషనర్లు, ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. జిల్లాలో మంజూరైన గ్రామపంచాయతీ భవన నిర్మా ణాలకు సంబంధించి, వాటిని గ్రౌండింగ్ పూర్తి చేసి ఈ నెల 30లోగా పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో మూడు కేటగిరీల్లో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ఆయా కేటగిరీల ప నుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు, ప్రత్యేక అధికారులు చూసుకోవాలన్నారు. హరిత లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్యం మేరకు ప్రణాళికతో మొక్కలు నాటాలని సూచించారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృ తి వనాలకు బయో ఫెన్సింగ్ వేయాలన్నారు. రోడ్ సైడ్ అవె న్యూ ప్లాంటేషన్, విద్యాసంస్థల్లో నాటిన మొక్కల్లో ఖాళీ స్థ లాల్లో మొక్కలు నాటి, పూర్తి చేయాలన్నారు. హరితహారం పనులపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు.
బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం
బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం పథకం కింద జిల్లాలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. మండల, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ఎప్పటికపుడు దరఖాస్తుల పరిశీలనపై సమీక్షించాలని సూచించారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీకి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మహిళా సమాఖ్యల ద్వారా చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణాలపై దృష్టి సారించి, పనులను వేగంగా పూర్తి చేయాలని డీపీఏంలకు సూచించారు. మనఊరు – మనబడిలో చేపట్టిన పనులను సంబంధిత ఎగ్జిక్యూటీవ్ ఏజెన్సీలతో మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు. పూర్తయిన పనులకు ఎఫ్టీవోలు వెంటనే జనరేట్ చేయాలని సూచించారు. పాఠశాలల్లో మం జూరైన పనులన్నింటినీ గ్రౌండ్ చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికపుడు సమీక్షించాలని డీఈవోకు సూచించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచినందుకు విద్యాశాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీపీవో సురేశ్మోహన్, బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీశ్, డీఈవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవోలు, ఎం పీవోలు, ఎంఈవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.