సంగారెడ్డి కలెక్టరేట్/ సదాశివపేట/ కంది, జనవరి 4: సర్కారు బడులను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక బసవ సేవా సదన్లో టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనఊరు మనబడి, తొలిమెట్టు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. టీఎంఎల్ మేళా ద్వారా విద్యార్థులకు బోధనలో నైపుణ్యాలను వినియోగించుకునేందుకు దోహదపడుతుందన్నారు. మేళాలో మొత్తం 540 బోధనోపకరణాలు ప్రదర్శించారు. విజేతలైన టీచర్లకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం కందిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ను ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ జిల్లాలోని ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల నిధులు కేటాయించారన్నారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కలు, పల్లెప్రకృతి వనాలతో గ్రామాలన్నీ పచ్చదనంతో నిండుకున్నాయన్నారు.
యువత తమకు ఇష్టమైన కళా రూపాల్లో రాష్ట్ర స్థాయిలో రాణించాలని చింతా ప్రభాకర్ ఆకాంక్షించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా యువజనోత్సవాలు నిర్వహించారు. యువత కళాకారులుగా ఎదగాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో ఎదగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, జడ్పీటీసీ శ్రీదేవీరాంరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీడీవో పూజ, ఎంఈవో అంజయ్య, మండల నోడల్ అధికారి రుద్ర ప్ప, ఎంపీపీ సరళా పుల్లారెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, సర్పంచ్ విమల వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ నరహరిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, ఎంపీడీవో విశ్వప్రసాద్, తహసీల్దార్ విజయలక్ష్మి, జిల్లా యు వజన, క్రీడల అధికారి జి రాంచందర్రావు, సహాయ అధికారి జావేద్ అలీ, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రెడ్డి, రాంరెడ్డి, నందకిశోర్, రామకృష్ణారెడ్డి, ఆనంద్రావు, కొండల్రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గుమ్మడిదల, జనవరి4: టీఎల్ఎం మేళాతో విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెంచుతుందని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ అన్నారు. ప్రయోగాత్మకంగా విద్యా బోధన చేస్తే చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి జడ్పీహెచ్ఎస్లో టీఎస్ మేళా తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్ఎం ఎగ్జిబిట్స్లను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన గురించి పలు పాఠశాలల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం)తో విద్యార్థులకు సులభంగా చదువుకోవడానికి వీలుంటుంది. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడంతో చిరకాలంగా గుర్త్తుండిపోతుందన్నారు. ఈ మేళాలో ప్రదర్శించిన ఎగ్జిబిట్స్లను ఎంపిక చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామన్నారు. ఉత్తమ ఎగ్జిబిట్స్కు బహుతులు, ప్రశంసా పత్రాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ, ఇన్చార్జి ఎంఈవో దాస్యం రాంబాబు, బీఆర్ఎస్ నాయకుడు ఆలేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ నాగేందర్గౌడ్, ఉపాధ్యాయులు ప్రసాద్, వేణుగోపాల్, బ్రహ్మం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి అభ్యాసన సామర్థ్యాలు సాధించాలని డీఈవో నాంపల్లి రాజేశ్ పిలుపునిచ్చారు. గాంధీ సెంట్నరీ పాఠశాలలో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్-టీఎల్ఎం ముగింపు సమావేశానికి హాజరయ్యారు. ఉపాధ్యాయులు తయా రు చేసిన టీఎల్ఎం (బోధన అభ్యాసన సామగ్రి)ని పరిశీలించారు. టీఎల్ఎం (టీచింగ్, లర్నింగ్ మెటేరియల్స్)ను ఉపయోగించి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. టీఎల్ఎం విద్యార్థుల వికాసానికి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అనురాధ, వెంకటేశం, డీసీఈబీ సెక్రెటరీ లింబాజీ, ఎంఈవో వెంకట నర్సింలు, ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి జాకీర్ హుస్సేన్, క్లస్టర్ నోడల్ అధికారులు, నాగార్జునరెడ్డి, విశ్వనాథం, శోభారాణి, రజితలీల సత్తుగొండ, జగదీశ్వర్ పాల్గొన్నారు.