హుస్నాబాద్ టౌన్, అక్టోబర్ 15: సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల మూడో జైత్ర యాత్ర హుస్నాబాద్ నుంచి ఆదివారం ప్రారంభమైంది. సెంటిమెంట్గా భావిస్తున్న హుస్నాబాద్లోని కరీంనగర్ రోడ్డులో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. బహిరంగ సభకు మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.కేశవరావు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డితోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.