చిన్నశంకరంపేట, మే 21: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని గవ్వలపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. చేతివృత్తుల వారికి చేయూతనిస్తున్నారన్నారు. గొల్లకుర్మల సంక్షేమానికి రాయితీపై గొర్రెలు అందజేస్తున్నారన్నారు.
రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలుకావడం లేద ని ప్రశ్నించారు. అనంతరం గవ్వలపల్లి గిరిజన తండా సర్పంచ్ గోపాల్నాయక్ కూతురు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమం లో మాజీ ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, సర్పంచ్ మం గాదేవి, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ రాంరెడ్డి పాల్గొన్నారు.