చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో పండుగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తన సతీమణి శోభతో కలిసి గురువారం చింతమడకకు వెళ్లిన ఆయన అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సీఎం రాక విషయం ముందుగానే తెలుసుకున్న గ్రామస్తులు పోలింగ్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసి తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సీఎంతో చేయి కలిపేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపారు.