రామాయంపేట, ఆగస్టు 30 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన్ల పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశట్టారన్నారు.
ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి, రూ. లక్షా116 అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వడ్లు కొనుగోలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. మేడం తనకు పింఛన్ రాలేదని ఎమ్మెల్యే ముందు మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ బోరునవిలపించింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, సర్పంచ్ మహేందర్రెడ్డి ఆమె వద్దకు వెళ్లి కచ్చితంగా పింఛన్ ఇప్పిస్తానమ్మా అంటూ సముదాయించింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, వైస్ ఎంపీపీ ముస్కుల స్రవంతి, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మండల అధ్యక్షుడు మహేందర్రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, కౌన్సిలర్లు దేమె యాదగిరి, గంగాధర్, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, ఎంసీడీవో ఉమారాణి, ఎంపీవో గిరిజారాణి, సర్పంచ్లు సం ధ్య, శంకర్, చంద్రకళ, జ్యోతి, దయాలక్ష్మి, సుభాశ్రాథోడ్, నర్సమ్మ, భాగ్యలక్ష్మి, శ్యాములు, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు చింతల రాధాభవాని, మల్యాల కవిత, చంద్రపు శోభ, దేవుని రాజు, సరాఫ్, శ్యాంసుందర్, యాదగిరి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటా
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మక్కకు జీవితకాలం రుణపడి ఉంటాం. ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేకుం డా పోయిందని, ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ దివ్యాంగుల పిం ఛన్ రూ.3వేలు అందించి నా కుటంబాన్ని ఆదుకున్నాడు.
– కాపు నాగమణి, దివ్యాంగురాలు, కోమటిపల్లి
వృద్ధాప్య పింఛన్ వచ్చింది
వృద్ధాప్య పింఛన్ సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిండు. ఇప్పుడు నాకు ఎలాంటి తిప్పలు ఉం డవు. నెలకు రూ.2116 వస్తా యి. నా ఖర్చులకు సరిపోతా యి. సీఎం కేసీఆర్ సార్, పద్మక్కను ఎప్పుడూ మరువను.
– దర్శి రాములు, రామాయంపేట
జీవితానికి ఆసరా
ఆసరా పింఛన్ రాక ఏడాదులు గడుస్తున్నది. ఇప్పుడు వచ్చింది. ఇప్పటినుంచి పిల్లా పాపలతో మంచిగా ఉంటాం. మాకింకా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.ఆసరా పింఛన్తో బతుకీడుస్తాం. నా భర్త కూలీ పనులు చేస్తాడు. నేను బీడీలు చుడతా. కష్టకాలంలో మేము ఉన్నాం. ఇప్పుడు పింఛన్ వచ్చింది బాధలేదు.
– సంధ్యారాణి, బీడీ కార్మికురాలు
నిజాంపేట మండలంలో 19 వేల ఎకరాలకు సాగునీరు
ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తే, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ కృషితో మోటర్లకు మీటర్లు లేకుండా రైతులు ఆత్మగౌరవంగా వ్యవసాయం చేసుకుంటున్నారని ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన 814 మంది లబ్ధిదారులకు మంజూరైన పింఛన్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా అర్హులందరికీ పింఛన్లు అందజేస్తున్నారన్నారు. కాళేశ్వరం ద్వారా నిజాంపేట మండలానికి 19వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జడ్పీటీసీ విజయ్కుమార్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, ఎంపీవో రాజేందర్, సర్పంచులు అమరసేనారెడ్డి, అరుణ్కుమార్, అనిల్కుమార్, గేమ్సింగ్, నర్సింహారెడ్డి, అనూష, కృష్ణవేణి, చంద్రవర్ధిని, నర్సవ్వ, సునీ త, ప్రీతి, ఎంపీటీసీలు లహరి, బాల్రెడ్డి, సురేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సంపత్, మండల యూత్ అధ్యక్షుడు మావురం రాజు, టీఆర్ఎస్ నా యకులు లక్ష్మీనర్సింహులు, దయాకర్, రవి, లక్ష్మ ణ్, నాగరాజు, పాల్గొన్నారు.