జహీరాబాద్, జూలై 20 : ముస్లిం మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్ధ్దికి కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. గురువారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన యువకులు ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన యువకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం, ఎస్సీలకు ఉపాధి కోసం దళిత బంధు పథకం ఏర్పాటు చేసి ఆర్థికంగా అందుకుంటున్నారని తెలిపారు.
బీసీలో ఉన్న కులవృతుల వారీగా ఆర్థికంగా ఆదుకునేందుకు లక్ష సాయం చేస్తున్నారని వివరించారు. ముస్లింలకు ఉపాధి కోసం లక్ష సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గిరిజనులకు ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పోడు పట్టాల సమస్యలు పరిష్కారం చేసి వారికి భూముల పై హక్కులు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సయ్యద్ మొహినొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు ఇజ్రాయిల్ బాబీ, పలు పార్టీలకు చెదిన ఫయ్యజ్, రాజు, శ్రీనివాస్తో పాటు పలువురు చేరారు.