అభివృద్ధికి కట్టుబడిన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం శివ్వంపేట మండలంలోని పోతులబొగుడ, పాంబండ, శంకర్తండా, థౌర్యతండా, ఉసిరికపల్లి, భీమ్లతండా, సీతారాంతండా, రత్నాపూర్, కొత్తపేట, అల్లీపూర్, రూప్లతండా, లింగోజిగూడ, పిల్లుట్ల గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి వారు ముమ్మరంగా ప్రచారం చేశారు. నిండు మనసుతో దీవిస్తున్నా.. తల్లీ నువ్వే గెలుస్తావమ్మా.. అని సునీతారెడ్డిని తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు మన్నె నర్సింలు ఆశీర్వదించారు.
శివ్వంపేట, నవంబర్ 20: ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు గెలిపించాలని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డిలుఅన్నారు. సోమవారం శివ్వంపేట మండలంలోని పోతులబొగుడ, పాంబండ, శంకర్తండా, థౌర్యతండా, ఉసిరికపల్లి, భీమ్లతండా, సీతారాంతండా, రత్నాపూర్, కొత్తపేట, అల్లీపూర్, రూప్లతండా, లింగోజిగూడ, పిల్లుట్ల గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలసి ముమ్మరంగా ప్రచారం చేశారు. గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో, నాయకులు బ్యాండు చప్పుళ్లు, పటాకులు కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పదేండ్లలో నర్సాపూర్ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. నర్సాపూర్ పట్టణంలో బస్సు డిపో, ఫోర్లేన్ రోడ్డు, హల్దీ వాగు, మంజీరా నదిపై 14 చెక్డ్యాంలు నిర్మించారన్నా రు. వీటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నా రు. మీ ఆడబిడ్డగా వస్తున్నానని, తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మీ అందరికీ సేవచేస్తానన్నారు.
ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని సూచించారు. నర్సాపూర్ బరిలో సీఎం కేసీఆర్ నిలిపిన సునీతాలక్ష్మారెడ్డి గెలుపునకు ప్రతిఒక్కరూ సహకరించి, భారీ మెజార్టీతో గెలుపించుకోవాలని సూచించారు. ప్రచారంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, సీనియ ర్ నాయకులు పిట్ల సత్యనారాయణ, తూము కృష్ణారావు, వాకి టి హనుమంతరెడ్డి, గూడూరు యాదగౌడ్, మర్రి మహేందర్రె డ్డి, రాజశేఖర్గౌడ్, స్వాతి విష్ణువర్ధన్రెడ్డి, స్వామి, గంగాధర్, సర్పంచ్లు ఎడ్ల హరికిషన్రావు, శివులు, బాబురావు, సోని రవినాయక్, శ్రీనివాస్గౌడ్, చంద్రకళ, రమాకాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు మర్రి సత్తిరెడ్డి, సంధ్య చత్రునాయక్, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
ఈ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గంలో నువ్వే గెలుస్తావు తల్లి అని తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిని ఆశీర్వదించారు. ప్రచారంలో భాగంగా మండలంలోని పాంబండ గ్రామానికి చెందిన తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు మన్నె నర్సింలు ఇంటికి ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలసి వెళ్లి పరామర్శించారు. ఉద్యమ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజలకు సేవలందిస్తున్న మదన్రెడ్డి, ప్రస్తుత అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ఇద్దరూ తన ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. నిండు మనసుతో దీవిస్తున్నానని, సునీతారెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తుందని, మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుందన్నారు.