నారాయణఖేడ్, అక్టోబర్ 27 : సీఎం కేసీఆర్ ఈ నెల 30న నారాయణఖేడ్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని కరస్గుత్తి రోడ్డు ప్రాంతంలోని రెహమాన్ ఫంక్షన్హాల్ సమీపంలో నిర్వహిస్తున్న బహిరంగసభలో సీఎం కేసీఆర్ కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో శుక్రవారం సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ సభాస్థలిని సందర్శించి భద్రతా ఏర్పాట్లపై స్థానిక డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఇతర అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్య లు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పా ర్కింగ్, భద్రతా అంశాలపై సూచనలు చేశారు. సీఎం పర్యటన ఏర్పా ట్లను పోలీసులు, సిబ్బంది సమన్వయంతో చేయాలని ఆదేశించారు.
నారాయణఖేడ్లో ఈ నెల 30న సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సీఎం సభాస్థలిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సభా వేదిక, సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్ల విషయమై మున్సిపల్ వైస్ చైర్మన్ ఆహీర్ పరశురాం, నాయకులు వంశీధర్రెడ్డికి పలు సూచనలు చేశారు. ఇప్పటికే సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాలను చదును చేసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పనులను మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు పార్శెట్టి సంగప్ప, అంజాగౌడ్, హిదాయత్అలీ, రాజునాయక్, దత్తు, శంకర్ తదితరులు ఉన్నారు.