రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేస్త్తున్నది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసింది. మెదక్ జిల్లాలో బీటీ, పంచాయతీ రోడ్లకు రూ.113.74 కోట్లు కేటాయించింది. సంగారెడ్డి జిల్లాలో బీటీ, పంచాయతీరోడ్ల అభివృద్ధికి రూ.71.03 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. ఈ నిధులతో రోడ్లు కొత్తరూపు సంతరించుకొని రవాణా సౌకర్యం మెరుగు పడుతుందని, వాహనదారుల ఇక్కట్లు తీరుతాయని మంత్రి పేర్కొన్నారు.
– సంగారెడ్డి/మెదక్(నమస్తే తెలంగాణ), డిసెంబర్ 14
సంగారెడ్డి డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే పంచాయతీరాజ్ రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ నిధులు విడుదలచేశారు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ రహదారుల బీటీ రెన్యువల్, వరదలతో దెబ్బతిన్న పంచాతీరాజ్ రహదారులు, కల్వర్టులు, బ్రిడ్జిల మరమ్మతులకు సీఎం కేసీఆర్ బుధవారం రూ.71.03కోట్ల నిధులు విడుదల చేశారు.
పంచాయతీరాజ్ రోడ్లకు బీటీ రెన్యువల్కు రూ.34.97 కోట్లు, ఇటీవల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంచాతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల మరమ్మతులకు రూ.36.06 కోట్లు, సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలోని 13.18 కిలోమీటర్ల రోడ్డు బీటీ రెన్యువల్ పనుల కోసం రూ.60.04 లక్షలు, పటాన్చెరు నియోజవకర్గంలోని అమీన్పూర్, జిన్నారం మండలంలో 5.78 కిలోమీటర్ల పీఆర్ రోడ్డు బీటీ రెన్యువల్ పనుల కోసం రూ.24 లక్షలు, జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లోని 20.33 కిలోమీటర్ల రహదారుల బీటీ రెన్యువల్ పనులకు రూ.10.40 కోట్లు, అందోలు నియోజకవర్గంలోని అందోలు, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్, వట్పల్లి మండలాల్లోని 10.05 కిలోమీటర్ల బీటీ రెన్యువల్ పనుల కోసం రూ.61.2 కోట్లు, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్, కంగ్టి, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్, సిర్గాపూర్ మండలాల్లో 16.85 కిలోమీటర్ల రహదారులకు బీటీ రెన్యువల్ కోసం రూ.10 కోట్లు విడుదల చేశారు.
వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.37 కోట్ల నిధులు విడుదల చేసింది. సంగారెడ్డి నియోకజవర్గంలోని కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో 75.86 కిలోమీటర్ల రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.12.20 కోట్లు, హత్నూర మండలంలోని 2.30 కిలోమీటర్ల రహదారి మరమ్మతులకు రూ.50 లక్షలు విడుదలయ్యాయి. పటాన్చెరు నియోజవర్గంలోని అమీన్పూర్, పటాన్చెరు, జిన్నారం మండలాల్లో 17.41 కిలోమీటర్ల రహదారుల మరమ్మతు పనులక కోసం ప్రభుత్వం రూ.7.01 కోట్ల నిధులు విడుదల చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగుడంపల్లి మండలంలో 3.19 కిలోమీటర్ల రహదారుల మరమ్మతులకు రూ.1.85 కోట్లు నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి నారాయణఖేడ్, సిర్గాపూర్ మండలాల్లోని 45.82 కిలోమీటర్ల రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14.50 కోట్లు విడుదలచేసింది. పంచాయతీరాజ్ రహదారుల బీటీ రెన్యువల్, వరదలతో దెబ్బతిన్న పీఆర్ రహదారులు, బ్రిడ్జిలు, కల్వర్టుల మరమ్మతుల కోసం సీఎం కేసీఆర్ జిల్లాకు రూ.71.03 కోట్ల నిదులు విడుదల చేయడంపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తంచేశారు.
మెదక్ జిల్లాలో..
మెదక్,డిసెంబర్14: (నమస్తే తెలంగాణ): మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని గిరిజన ప్రాంతాలు రోడ్లు, పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, రోడ్లకు మహర్దశ పట్టనున్నదని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 43.10 కిమీ రోడ్లకు రూ.44 కోట్ల 33 లక్షలు, నర్సాపూర్ నియోజకవర్గంలో 89,01 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.69 కోట్ల 41 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. పంచాయతీరాజ్శాఖ రెండు నియెజకవర్గాల్లో 110.42 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి 43 పనులు చేపట్టేందుకు రూ.49 కోట్ల 14 లక్షల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు
మెదక్ నియోజకవర్గానికి మంజూరైన నిధులు
మెదక్ మండలంలో తిమ్మక్కపల్లి తండా, బాలానగర్ తండా, వెంకటపూర్తండా, మల్కాపూర్ తండా, సంగాయిగుడితండాల్లో 5.05 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్ల ఆరు లక్షలు, రామాయంపేట్ మండలంలో దామరచెరువు తండా, సదాశివనగర్ తండా, బిల్యాతండా, భిక్షపతితండా, పెద్దతండా, రామాయంపేట తండా, 12 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.13 కోట్ల 72 లక్షలు, హవేళీఘనపూర్ మండలంలో లింగసాన్పల్లి తండా, సూర్యతండా, శుక్లాల్పేట్ తండా, కొత్తచెరువు తండా, గజిరెడ్డిపల్లి బంజరా తండాల్లో 7.40 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.7 కోట్ల 50 లక్షలు, పాపన్నపేట మండలంలో అన్నారం తండా, సీతయ్య తండాలలో 4.05 కిలో మీటర్లకు, నిజాంపేట్ మండలంలో కాసీంపుర తండా, శౌకత్ పల్లి తండాల్లో 5.10 కిలో మీటర్లకు రూ.4 కోట్ల 95 లక్షలు, శంకరంపేట్ మండలంలో కొర్విపల్లి తండా, జంగరల్ ఎల్టీ, సురారం ఎల్టీ, చందంపేట, మిర్జాపల్లి ఎల్టీ, గవ్వలపల్లి ఎల్టీల్లో 8.6 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.9కోట్ల 10లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో..
నర్సాపూర్ మండలంలో చిన్నచింతకుంట నుంచి రూప్లా తండా, జువ్వి పోచమ్మ తండా, తిరుమలాపూర్ ఎల్టీ విల్యతండా, రాంజ్యతండా, ధర్మ ఎల్టీల్లో 15.8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్ల 67 లక్షలు, శివ్వంపేట మండలంలో గుమ్మడిదల జడ్పీ రోడ్డు నుంచి రాజులు తండా వరకు, ఫీకీరా తండా, చర్చి తండా, శంకర్తండా, సికింద్లాపూర్ తండాల్లో 10.51 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.7 కోట్ల 48 లక్షలు, వెల్దుర్తి మండలంలో రామయంపల్లి రోడ్డు నుంచి వెల్దుర్తి వరకు శెట్టిపల్లి కాలం తండాల్లో 5 కిలో మీటర్ల రహదారికి రూ.3కోట్ల 86లక్షలు మంజూరయ్యాయయని మంత్రి తెలిపారు.
మాసాయిపేట మండలంలో కొప్పులపల్లి నుంచి కొప్పులపల్లి ఎల్టీ వరకు 2కిలోమీటర్ల రహదారికి రూ.కోటి 28 లక్షలు, కౌడిపల్లి మండలంలో లింగంపల్లి ఎల్టీ నుంచి సోమ్లా ఎల్టీ వరకు లింగంపల్లి జడ్పీ రోడ్డు, మెదక్-జోగిపేట పీడబ్ల్యూడీ రోడ్డు, కౌడిపల్లిలోని ట్యాంక్బండ్, కౌడిపల్లిలోని పెద్ద చెరువు ప్రాంతాల్లో 15.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.12 కోట్ల 79లక్షలు మంజూరు చేశామన్నారు. చిలిపిచెడ్ మండలంలో శీలంపల్లి నుంచి మొండి తండా వరకు, రహీంగూడా నుంచి పైజాబాద్ ఎల్టీ వరకు శీలంపల్లి నుంచి సోమక్కతండా, బట్టు తండా వరకు గౌతాపూర్ ఎల్టీ నుంచి రాందాస్ గూ డా వరకు 16.65 కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి రూ.13 కోట్ల 56 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
కొల్చారం మండలంలో జడ్పీ రోడ్డు నుంచి జలబై తండా వరకు, తుమ్మలపల్లి ఎల్టీ నుంచి పోతిరెడ్డిపల్లి వరకు యోన్ జలాల్పూర్ నుంచి ఎన్ఎస్ఎఫ్ రోడ్ వరకు పీడబ్ల్యూ రోడ్డు నుంచి వాల్య తండా, నాణ్య తండా వరకు 12.45 కిలో మీటర్ల రహదారి రూ.11 కోట్ల 18 లక్షలు నిధులు మంజూరు చేశామని మంత్రిహరీశ్రావు పేర్కొన్నారు.