ఎక్కడి గోదావరి… ఎక్కడి తూప్రాన్, మనోహరాబాద్… కలలోనైనా అనుకున్నామా? గోదావరి జలాలు మన పొలాలను తడుపుతాయని.. ఇదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమై నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్లోని శుభం గార్డెన్స్, కూచారంలోని ప్రభుత్వ ఫంక్షన్హాల్లో శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులు, కుంటలను నింపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. వేసవిలో హల్దీవాగు అలుగులు పారుతూ వేలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నదన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో సుమారు 30కి పైగా ట్రాక్టర్లలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు భారీ ర్యాలీ తీసి, బీఆర్ఎస్కు మద్దతుగా నినాదాలు చేశారు.
వ్యవసాయరంగం, రైతుల అభివృద్ధికి తెలంగాణ సర్కారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. వెల్దుర్తిలో రైతువేదికను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్తో కలిసి ప్రారంభించారు. కుకునూర్, మంగళపర్తి గ్రా మాల్లో రైతువేదికను ప్రారంభించారు. ఆయా సమావేశాల్లో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పదేండ్లలో అన్ని రం గాల్లో దూసుకుపోతున్నదన్నారు. పండిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని, ప్రజలు వాటిని గమనిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల కాలంలోనే సంపూర్ణ అభివృద్ధ్దిని సాధించిందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి పథకాలను అమలు చేసూ దేశానికి ఆదర్శంగా రాష్ట్రం నిలుస్తున్నదన్నారు. రాష్ర్టాభివృద్ధిపై ప్రజలకు తెలియజేయాలనే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నదన్నారు వ్యవసాయాభివృద్ధి, రైతుల సహాయార్థ్దం రైతు వేదికలను నిర్మించినట్లు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. కొల్చారం మండలంలోని కొల్చారం, పోతంశెట్పల్లి, రంగంపేట, పైతరలో రైతు వేదికలను ఏవో శ్వేతకుమారి, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల ప్రారంభించారు. పైతరలో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఎడ్లబండిపై వచ్చారు.
దేశం గర్వించే పథకాలు : ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి
దేశం గర్వించే స్థాయిలో తెలంగాణలో రైతు సంక్షేమ పథ కాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు. హవే ళీఘనపూర్ మండలం బ్యాతోల్లో నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎడ్లబండ్లపై రైతు వేదికకు ర్యాలీగా వచ్చి, రైతులకు సంక్షేమ పథకాలను వివరించారు.
రైతు సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేట పట్టణంలో రైతు దినోత్సవంలో పాల్గొన్నారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొని, సభలో మాట్లాడారు.
రైతే దేశానికి వెన్నుముక : ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
రైతే దేశానికి వెన్నుముక అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్, టేక్మాల్ మండలం కాదులూర్లో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముస్లాపూర్లో రైతు వేదిక వరకు ఎడ్ల బండి మీద కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీగా వచ్చారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, జూన్ 3