‘ఝరాసంఘం కేతకీ సంగమేశ్వరుడు కొలువైన ఈ నేలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాళేశ్వర ప్రాజెక్టుతో సింగూరుకు లింక్ చేసుకుంటున్నాం. కాల్వల పనులు పూర్తి అవుతున్నాయి. సంగమేశ్వర ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుంది’..అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. గురువారం జహీరాబాద్లో పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానికేతరులకు ఓటేస్తే మన ఇజ్జత్ పోతదని, అందుబాటులో ఉండే మాణిక్రావును గెలిపించుకోవాలని కోరారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీ కండ్ల ముందు ఉందని, సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందాయన్నారు. వీటన్నింటినీ ఆలోచన చేసి ఓటు వేయాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తాగునీటి కష్టాలు తీర్చుకున్నామని, సాగునీరు తెచ్చుకున్నామని, రైతులకు నాణ్యమైన కరెంట్ను ఇస్తున్నామని తెలిపారు. మరోసారి జహీరాబాద్లో బీఆర్ఎస్ను గెలిపిప్తే మరింత అభివృద్ధి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
సిద్దిపేట, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఝరాసంఘం కేతకీ సంగమేశ్వరు డు కొలువైన ఈ భూమికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. జహీరాబాద్ ని యోజకవర్గానికి సంగమేశ్వర, నా రాయణఖేడ్కు బసవేశ్వర ప్రాజెక్టులు వస్తున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టుతో సింగూరుకు లింక్ చేసుకుంటున్నాం, కాల్వల పనులు పూర్తి అవుతున్నా యి. సంగమేశ్వరతో లక్ష ఎకరాలకు సాగునీరు వ స్తుంది అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రా వు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మె ల్యే మాణిక్రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ బీబీపాటిల్తో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి ఆశేషంగా తరలివచ్చిన ప్రజలతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మంత్రిగా ఉన్న సమయంలో జహీరాబాద్ ప్రాంతంలో తిరిగానని, ఏడాకుల చెరువును కట్టించానని చెప్పారు. ఏడాకులపల్లి చెరువును పెద్దగా చేస్తే ఇయ్యాళ వెయ్యి ఎకరాలకు సాగునీరు అందుతున్నదని చెప్పారు. హరీశ్రావు నీటిపారుదల శాఖ మం త్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద వందలాది చెరువులు పునరుద్ధరించుకున్నామన్నారు. ప్రాజెక్టులు, లిప్టులతో నీళ్లు పారుతున్నాయో ప్రతి రాష్ట్రంలో నీటితిరువాను వసూలు చేస్తారన్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో సైతం వసూలు చేస్తారని తెలిపారు. మన రాష్ట్రంలో నీటి పన్నును రద్దు చేశామన్నారు. రైతులకు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. ప్రతి గుంటకు రైతుబంధు ఇస్తున్నామన్నారు. రైతుబంధును సృష్టించింది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. ఎవరైన రైతు ఆకాలమరణం చెందితే రైతుబీమా కింద రూ.5 లక్షలు వారంలోపల ఆ ఇంటికి అందిస్తున్నామన్నారు. రైతుల ముంగిటనే కాంటలు పెట్టి రైతు పండించిన ధాన్యాన్ని కొట్టున్నామని చెప్పారు.
నారింజ ప్రాజెక్టును పట్టించుకునే వారేలేరు.. ఇప్పుడు మాణిక్రావు అడిగారు. దానిని కొంత మేర చేసుకున్నాం..పూర్తి చేయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దీనిని మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. సంగమేశ్వర లిప్టు పనులు కూడాజరుగుతున్నాయన్నారు. సింగూరుకు కాళేశ్వరం లింకు చేసుకుంటే మనకు 365 రోజలు సింగూరు నిండా నీళ్లు ఉంటాయన్నారు. దీంతో రెండు పంటలు పండించుకోవచ్చన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు వస్తుందన్నారు.
వికారాబాద్లో చెల్లని రూపాయి…
జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తిది వికారాబాద్. మన దగ్గర లీడర్లు లేరని వికారాబాద్ నుంచి తీసుకొచ్చారా.? వికారాబాద్లో చెల్లని రూపాయి జహీరాబాద్లో చెల్లుతుందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వాళ్లకే ఇకారం అని చెప్పి వాళ్లు ఎలగొటిండ్రు… రెండు మాట్ల ఓడ గొట్టిండ్రు మళ్ల జహీరాబాద్లో చెల్లుతుందా..? మన లోకల్ లీడర్ మాణిక్రావు కావాలనా..? వికారాబాద్ ఆయన కావాలనా..? ఇది జహీరాబాద్ ప్రజల ఆత్మగౌరవ పరీక్ష అని అన్నా రు. లోకల్ మనిషిని విడిచిపెట్టి పరాయి వ్యక్తిని గెలిపిస్తే ఏమైనా ఇజ్జత్ ఉంటుందా..? అందుకోసం దయచేసి మాణిక్రావు సౌమ్యుడు, ఉత్తముడు, జహీరాబాద్ ప్రజల మధ్యన ఉండే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కార బాధ్యత తీసుకుంటానని ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు.
జిల్లా మంత్రి హరీశ్రావు ఉన్నారు. మీరు అందరూ సహకరించి ఎమ్మెల్యేగా మాణిక్రావును గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. అన్ని పను లు చేసే బాధ్యతను తాను, మంత్రి హరీశ్రావు తీసుకుంటామని హామీనిచ్చారు. ఇప్పుడు హరీశ్రావు ఆరోగ్యమంత్రిగా ఉన్నారు. ఇవ్వాళ ప్రతి పల్లెలో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. పట్టణంలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసామన్నారు. నియోజకవర్గంలో వంద పడకల దవాఖానలు అందుబాటులోకి వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు.
మీ ఓటు వజ్రాయుధం అని వచ్చే ఐదేండ్లు మీ తలరాతను, మీ జహీరాబాద్, రాష్ట్ర తలరాతను మారుస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఓటు అంటే ఆషామాషి కాదన్నారు. బాగా ఆలోచన చేసి జాగ్రత్తగా ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు రాగానే ఆగంఆగం కావద్దు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాణిక్రావును గుణగణాలు చూడాలి..మీ అభ్యర్థి వెనకాల ఉన్న పార్టీ పనితీరును చూడాలన్నారు. ఈ తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీ కండ్ల ముందు ఉంది. చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ ముందట ఉన్నాయన్నారు. వీటన్నింటినీ ఆలోచన చేసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగా ణ ప్రజల కోసం అన్నారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు పాలించిందన్నారు. వారి పాలనలో ఎలా ఉంది .? తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక కష్టాలు పడ్డామన్నారు. ఏనాడూ ప్రజల కోసం ఆలోచన చేయాని పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంట్ కష్టాలతోపాటు చాలా ఇబ్బందులు ఉండేవన్నారు. రైతుల ఆత్మహత్యలు ఉండేవన్నారు. ఇవ్వాళ బీఆర్ఎస్ ప్రభు త్వం వచ్చాక తాగునీటి కష్టాలు తీర్చుకున్నామన్నారు. సాగునీరు తెచ్చుకున్నాం. రైతులకు నాణ్యమైన కరెంట్ను ఇస్తున్నామన్నా రు. రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని సీఎం చెప్పారు.
మాజీమంత్రి ఫరీదుద్దీన్ తనకు మంచిమిత్రుడు.. ఎప్పుడూ ఫరీదుద్దీన్ జహీరాబాద్ అభివృద్ధి కోసం మాట్లాడేవారని, ఫరీదుద్దీన్ తనయుడు తన్వీర్కు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించానని సీఎం చెప్పారు. భవిష్యత్లో ఉన్నత పదవులు ఇస్తానని, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ముస్లింల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షే మ, అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేసిందన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన బోధన చేస్తున్నామని చెప్పారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు జహీరాబాద్ ఎమ్మెల్యే చెంగల్ బాగన్నతో కలిసి నియోజకవర్గంలో పర్యటించానన్నారు. ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి చెరువు నిర్మించి వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.