ఆనాడు సిద్దిపేట గడ్డ.. ఈనాడు గజ్వేల్ గడ్డ తనకు అండగా నిలిచి ఇంతవాడిని చేసిందని, ఈ గడ్డను మరువలేనని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో అశేష జనాన్ని ఉద్దేశించి సీఎం ప్రసగించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా కృషిచేశానని, ఇంకా చేసుకుందామన్నారు. రైలు వస్తదని ఇక్కడి ప్రజలు అనుకోలేదని, తెచ్చుకున్నామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడత అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేసి దళితవాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పారేద్దామని పిలుపునిచ్చారు. గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడడానికి ఇతర దేశాలు, ఇతర రాష్ర్టాల వాళ్లు వచ్చి చూసి వెళ్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో సాగు,తాగునీటి సమస్య శాశ్వతంగా తీర్చుకున్నట్లు తెలిపారు. పవిత్రంగా భావించే గోదావరి జలాలు తెచ్చుకుని తాగుతున్నాయని, మన పొలాల్లో పారేది గోదావరి జలమే అని సీఎం కేసీఆర్ చెప్పారు. మీ ఆశీర్వాదంతో పదేండ్లుగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నానని, మరోసారి దీవించాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
సిద్దిపేట, నవంబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు నాకు బలాన్నిచ్చిన గడ్డ సిద్దిపేట అయితే.. ఆ తర్వాత సాధించిన తెలంగాణను తీర్చిదిద్దేండుకు తనను ఎమ్మెల్యేను చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ గజ్వేల్ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన ఆక్కాచెల్లెలకు అన్నదమ్ములకు సీఎం కేసీఆర్ నమస్కారాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ… గజ్వేల్ తన గౌరవాన్ని పెంచి, ఈ స్థాయికి తెచ్చిందన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా గజ్వేల్ ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా కృషిచేసినట్లు తెలిపారు. మిత్రులు వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్ ఏమేమి చేసుకున్నామో అన్ని సభలో మీకు చెప్పారన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి, ప్రజల కోసం జరిగిన పనులు అన్నీ మీ కండ్ల ముందు ఉన్నట్లు తెలిపారు. గతంలో మంచినీళ్ల కోసం నానా ఇబ్బందులు పడ్డ గజ్వేల్కు శాశ్వతంగా ఆ బాధ తీర్చినట్లు సీఎం తెలిపారు. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ గజ్వేల్కు ప్రాజెక్టులు తెచ్చినట్లు తెలిపారు.గజ్వేల్కు రైలు వస్తదని మనం ఎన్నడూ అనుకోలేదని, రైలు కూడా తెచ్చుకున్నామన్నారు. గజ్వేల్ అన్నిరంగా ల్లో గుర్తింపు పొందినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
గజ్వేల్ మోడల్ అభివృద్ధిని చూడడానికి ఇతర దేశాలు, ఇతర రాష్ర్టాల వచ్చి చూసి వెళ్లారని సీఎం కేసీఆర్ చెప్పారు. మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అడవుల పునరుద్ధరణ, మల్లన్నసాగర్ ప్రాజెక్టు, కొండపోచమ్మ సాగర్, కోమటిబండ మిషన్ భగీరథ ప్రాజెక్టును చూడడానికి ఎక్కడెక్కడి నుంచో బృందాలు వస్తున్నట్లు తెలిపారు. పవిత్రంగా భావించే గోదావరి జలాలు తెచ్చుకున్నామని తెలిపారు. ఇవాళ మనం తాగేనీళ్లు గోదావరి జలమేచ పొలాల్లో పారేది గోదావరి జలమే అని సీఎం కేసీఆర్ చెప్పారు.రోల్మోడల్గా గజ్వేల్ ఎదిగిందని, ఇక్కడికే సరిపోదన్నారు. ఇంకా చాలా పనులు చేసుకోవాల్సి ఉందన్నారు. మీ అందరినీ ఒక్కటే మాట కోరుతున్నానని… ఈ ఎన్నికల్లో ఇదే చివరి సభ అని సీఎం అన్నారు. గజ్వేల్ సభ 96వది అని చెప్పారు.ట్రిఫుల్ఆర్ మన గజ్వేల్ మీదుగానే రాబోతుందని సీఎం తెలియజేశారు.
24 ఏండ్లుగా తెలంగాణ ఆశ, శ్వాసగా తాను బతుకుతున్నానని సీఎం కేసీఆర్ చెప్పా రు. ఫిబ్రవరి వస్తే తనకు 70 ఏండ్లు వయస్సు వస్తుందన్నా రు. మీ అం దరి ఆశీర్వాదాలతో తెలంగాణను తెచ్చిన కీర్తే తనకు ఆకా శం అంతా ఎత్తు కీర్తి అని అన్నారు. పదవులు ముఖ్యం కాదని, మీ ఆశీస్సులతో 10 ఏండ్లుగా సీఎంగా ఉన్నాను అని చెప్పారు.
ఒకప్పుడు చెరువుల పరిస్థితి ఎలా ఉండే.. ఇవాళ చెరువులు ఎలా ఉన్నాయో రైతులు ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధ్దరించుకున్నట్లు చెప్పారు. గోదావరి జలాలతో మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయని తెలిపారు. భగవంతుని దయవల్ల మనకు కరువు లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పల్లె దవాఖానలు, పట్టణాల్లో బస్తీ దవాఖానలు,గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. విద్య, వైద్యరంగంలో అద్భుత పురోగతి సాధించామని సీఎం అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని, ‘మనఊరు-మనబడి’ ద్వారా ప్రభు త్వ పాఠశాలలను అభివృద్ధి చేసుకున్నామని సీఎం చెప్పారు.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు తనను గెలిపించారని సీఎం కేసీఆర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుడు ఎంత అవకాశం ఇచ్చిం డో.. ఎంత శక్తి ఇచ్చిండో అంతచేశానన్నారు. పట్టణాలు, గ్రామాలు, రైతులకు..అన్నివిధాలుగా అనే క కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈసారి మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. మిత్రుడు ప్రతాప్రెడ్డి తనకు కొన్ని విషయాలు చెప్పారన్నారు. కొండపోచమ్మ దేవాలయం, నాచగిరి లక్ష్మీనర్సింహా దేవాలయాలను అద్భుతంగా చేసుకుందామన్నారు. కొండపోచమ్మ, కొమురవెల్లి మల్లన్న దేవుళ్ల పేర్లు మీద ప్రాజెక్టుల పేర్లు పెట్టుకున్నామని, కొండపోచమ్మ దేవాలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎన్ని కోట్లు అవసరమైనా అద్భుత దేవాలయం గా మార్చుకుందామని సీఎం పేర్కొన్నారు.
హైదరాబాద్ కూతవేటు దూరంలో గజ్వేల్ ఉం దని సీఎం కేసీఆర్ చెప్పారు. తనతో చాలామంది మిత్రులు మాట్లాడారని చెప్పారు. మంచి స్థలాలు ఇప్పిస్తే ఐటీ టవర్లు పెడతామని కోరుతున్నారని, కేటీరామారావుకు ఇదివరకు ఈ విషయాన్ని చెప్పానని, ఇది పరిశీలన జరుగుతుందని సీఎం కేసీఆర్ సభలో చెప్పారు. గజ్వేల్కు కచ్చితంగా ఐటీ టవర్లు తెచ్చిపెట్టే బాధ్యత తనది అని చెప్పా రు. మండలాల్లో ఆఫీసు కాంప్లెక్సులు కట్టుకుంటున్నామని, మంచి మార్కెట్ యార్డులు ఇంకా రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండల కేంద్రంలో అద్భుతమైన మార్కెట్ యార్డులు నిర్మాణం చేసుకుందామని చెప్పారు.
మల్లన్నసాగర్కు పెద్దఎత్తున టూరిస్టులు వస్తున్నారని సీఎం తెలిపారు. వాగు, నది లేకుండా ఒక రిజర్వాయర్ను నిర్మించామని, ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద 50 టీఎంసీల ప్రాజెక్టు అని సీఎం చెప్పారు. దీనిని అనుసరించి 7వేల ఎకరాల్లో అద్భుతమైన అటవీ భూములు ఉన్నాయన్నారు. అక్కడ సుగంధ ద్రవ్యాల మొక్కలు నాటిస్తున్నట్లు చెప్పారు. మల్లన్నసాగర్ పనులు పూర్తి అవుతున్నాయని, అక్కడ అద్భుతమైన టూరిస్టు స్పాట్ను తయారుచేస్తామని హామీ ఇచ్చారు.
‘ఇక్కడకి ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్క మెడికల్ కళాశాల, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి , ఇందిరమ్మ రాజ్యం అంటూ వస్తున్న పార్టీలకు మనం ఒక్క ఓటు ఎందుకు వేయాలి’..అని సీఎం కేసీఆర్ అన్నారు. మనం ఏమన్న పిచ్చిగోషిగాళ్లమా..? ఇంత తెలివి తక్కువ వాళ్లమా..? ఇటువంటి పార్టీలను మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలన్నారు. ‘వాళ్లు ఏమంటరు.. మేం ఇయ్యకున్న మాకే గుద్దిండ్రు.. వీళ్లు గొర్రెలు అనుకుంటరు..మరి గొర్రెలమా..? ఎవలం అని నిరూపించాలి’..అన్నారు. 30న మనం నిరూపించాలని పిలుపునిచ్చారు. ‘50 ఏండ్లు గొడ గొడ ఏడ్చినం… ఆ బాధలు మర్చిపోయినమా..? ఇయ్యాళ హల్దీ, కూడవెల్లి వాగులు, వంకలు అన్నీ ఎండ కాలంలో మత్తళ్లు దుంకుతున్నాయి’..అని చెప్పారు. దయచేసి ప్రతి యువకుడు ఆలోచన చేయాలని, విచక్షణతోని ఓటు వేస్తే లాభం జరుగుతుందన్నారు.
‘గజ్వేల్ నియోజకవర్గం ఇక్కడే.. ఏది తక్కువ కాదు.. మీరు ఏది కోరినా అది వస్తనే ఉంటు ంది’..అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మొన్న ప్రచారంలో సంగారెడ్డి జిల్లా నుంచి వస్తూ గజ్వేల్ రింగురోడ్డు మీదుగా పోయిన. ఆ రింగు రోడ్డు నాకే ఆశ్చర్యం కలిగించింది. అంత బ్రహ్మాండగా ఇతర పట్టణాల వాళ్లు ఆసూయపడే విధంగా చేసుకున్నాం’ అని సీఎం అన్నారు. రాబోయే రోజుల్లో గజ్వేల్ హైదరాబాద్ శాటిలైట్ పట్టణం అవుతుందని, కాబట్టి అనేక పరిశ్రమలు, విల్లాలు కట్టేవాళ్లు ఇక్కడికి క్యూ కడుతున్నారని సీఎం చెప్పారు. రీజినల్ రింగురోడ్డు వచ్చిందంటే గజ్వేల్ దశనే పూర్తి గా మారుతుందన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఒక భూమిక ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర మొదటి ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా చేసినందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా సీఎం కేసీఆర్ ధన్యవాదా లు తెలిపారు. మీరు మళ్లీ అవకాశం ఇచ్చి పం పిస్తే, ఈ కీర్తిని ఇంకింత ఇముడింపజేసే విధం గా మన గజ్వేల్ అభివృద్ధిని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తానని, మీరంతా ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.
ముంపు గ్రామాల ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. వాళ్ల త్యాగ ఫలితంగానే ఒకనాడు చుక్క నీళ్ల కోసం తపించిన గజ్వేల్కు ఇవాళ 12 జిల్లాల నీళ్లు పంపించే ఖజానాగా తయారైందని చెప్పారు. మల్లన్నసాగర్ నుంచి చాలా నియోజకవర్గాలకు నీరు పోతాయని చెప్పారు. మన పక్కనే ఉన్న భువనగిరి, ఆలేరు, దుబ్బా క, సిద్దిపేట.. ఇంకా అనేక ప్రాంతాలకు, సిం గూరు ప్రాజెక్టుకు లింకు నారాయణ్ఖేడ్, నిజామాబాద్ జిల్లా ప్రజలకు నిజాంసాగర్కు మల్లన్నసాగర్ నుండే నీళ్లు పోతాయని సీఎం చెప్పా రు. ‘ఎవ్వరైతే నిర్వాసితులు అయిండ్రో వారందరికీ కృతజ్ఞతలు. వాళ్ల ప్రాంతంలో పరిశ్రమ లు పెట్టిస్తా.. ఉపాధి కల్పిస్తాను.. వంద శాతం నామాట నిలబెట్టుకుంటా’.. అని సీఎం చెప్పా రు. ఆ గ్రామాల త్యాగం వెలకట్టలేనిదని, వారి కి మంచి చేయాలని తన మనస్సులో మార్గం ఉందని సీఎం చెప్పారు. కచ్చితంగా ఆ పని చేస్తానని చెప్పారు. ‘ఇక్కడికి పరిశ్రమలు వస్తా యి..కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని.. తప్పకుండా రాబోయే రోజుల్లోనే ఒక డజన్ పరిశ్రమలు రాబోతున్నా యి’.. అని సీఎం చెప్పారు. గజ్వేల్లో మనం కూడా పంటల వైవి ధ్యం నేర్చుకొని బ్రహ్మాండంగా కమర్షి యల్ క్రాప్లు వేద్దామని పిలుపునిచ్చారు. ఈ దఫా శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందామన్నా రు. రైలు వచ్చిందన్నారు.దేశంలో నాలుగు మూలలకు పంపుకోవచ్చు అని చెప్పారు.
దళితజాతి బిడ్డలు మన సాటి మనుషులే నని సీఎం కేసీఆర్ అన్నారు. వారు వివక్షకు, దోపిడికి గురయ్యారని, వారు కూడా మనతో పైకి రావాలని చెప్పారు. రాష్ట్రంలో దళితబంధు కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్తను సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికలు పూర్తి కాగానే గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడత అన్ని కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ దళిత వాడల నుంచి దరిద్రాన్ని పీకి అవతల పారేద్దామని చెప్పారు. పంటల వైవిధ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండలంలో ఎక్కడికక్కడేనే ఆ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. దాంట్లో రైతులందరూ వాటాదారులుగా కావాలన్నారు. రైతుల బిడ్డలందరికీ ఉద్యోగాలు దొరకాలన్నారు. గొప్ప ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్గా తెలంగాణ రాష్ట్రం కావాలని తన కల అని సీఎం కేసీఆర్ చెప్పారు.