సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. ‘అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అంటారు పెద్దలు. సీఎం కేసీఆర్ అడగకముందే అభాగ్యుల కోసం అన్నీ చేస్తున్నారు. దేశంలో ఎకడా లేని విధంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీకార్మికులు, ఇతర వర్గాల వారికి ఆసరా పింఛన్లు అందిస్తుండడంతో వారంతా సంతోషంగా ఉన్నారు.
దివ్యాంగులకు రూ.4016లు, మిగతా వర్గాలకు రూ.2016 పింఛన్ అందజేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు అందుకుంటున్నవారు 4,69,575 మంది ఉన్నారు. నెల నెలా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమచేస్తున్నది. వారికి ఆర్థిక ధీమా కలుగుతున్నది.
– సిద్దిపేట, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట,సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం కేసీఆర్ పేదింటి పెద్ద కొడుకు అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి లేదు. ప్రతి ఇంటికి ఆసరా పింఛన్లు అందిస్తున్నా రు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు ఉన్నారు. ఇవాళ ఆసరాపింఛన్లతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీకార్మికులు, ఇతర వర్గాల వారు హాయిగా ఉన్నారు.
మా పేదింటా సీఎం కేసీఆర్ ఉన్నారు అని సంబుర పడుతున్నారు. నెల నెలా మాకు టంచన్గా డబ్బులు వేస్తున్నారని సంబుర పడుతున్నారు.’అడగనిదే అమ్మ అయి నా అన్నం పెట్టదని అంటారు పెద్దలు. మన సీఎం కేసీఆర్ అడగకముందే అభాగ్యుల కోసం అన్నీ చేస్తున్నారు. దేశంలో ఎకడా లేని విధంగా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలుపుకొని మొత్తం 4,69,575 మంది ఉన్నారు.
వీరిలో 1,64,405 మంది వృద్ధాప్య, 1,74,940 మంది వితంతువులు, 37,785 మంది వికలాంగులు, 4,814 మంది గీత కార్మికులు, 3,525 మంది చేనేత కార్మికులు, 3,107 మంది హెచ్ఐవీ బాధితులు, 3,448 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, 339 మంది డయాలసిస్ పేషంట్లు, 300 మంది బీడీ టేకేదారులు, 41,608 మంది బీడీ కార్మికులు, 15,304 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో చాలీచాలని పింఛన్లను కొన్ని వర్గాలకే అందించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, బీడీకార్మికులతోపాటుగా ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను కూడా అకున చేర్చుకొని పింఛన్లు అందజేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. నాటి సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవలం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చారు. ఇవాళ సీఎం కేసీఆర్ నెల నెలా దివ్యాంగులకు రూ.4016 రూపాయలు, మిగతా వర్గాలకు రూ.2016 అందజేస్తున్నారు. దేశంలోనే ఇలా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని చెప్పాలి. ప్రతి నెలా టంచన్గా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో డబ్బులను ప్రభుత్వం జమచేస్తున్నది.
మాకెంతో ‘ఆసరా’
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ పెద్దమనస్సుతో ఆసరా పింఛన్ పెంచిండు. ఏ గవర్నమెంట్ ఇంత పెంచలె. కాంగ్రెసోడు ఇయ్యలె..బీజేపోడు ఇయ్యలె. ఇయ్యా లా మాలాంటోళ్లను ఆదుకుంటున్నది కేసీఆర్ ఒక్కరే. ప్రతినెల పింఛన్ వస్తాంది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మల్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలె..వస్తడు కూడా..
– బ్యాగరి రాములు, ఇర్కోడు, సిద్దిపేటరూరల్ మండలం
కేసీఆర్ దేవుడు..
సిద్దిపేటరూరల్, సెప్టెంబర్ 22 : కన్నకొడుకులే ఈ రోజుల్ల్లో పట్టించుకుంటలేరు. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చేదానికి ఎంత కట్టపడ్డారో అందరికీ తెలుసు. మరి సీఎం అయ్యిండు. పేదోళ్లను ఆదుకోవాలని ఏదో ఒకటి చేస్తుండు. పింఛన్లు ఇచ్చి సాతగానోళ్లకు ఆసరాగా నిలుస్తుండు. ప్రతినెల పింఛన్ వస్తంది. కేసీఆర్కు తిరుగులేదు. మల్లా సీఎం అయితడు.
– లింగంపల్లి మల్లయ్య, ఇర్కోడు, సిద్దిపేటరూరల్ మండలం
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం..
జగదేవ్పూర్ సెప్టెంబర్ 22 : నా పేరు అజయ్.. మా ఇంట్లో అమ్మా నాన్న అన్న నలుగురం ఉంటాం అమ్మా నాన్న అంగవైకల్యంతో ఉన్నారు. వారిద్దరికి సీఎం కేసీఆర్ అందిస్తున్న పింఛన్ వస్తుంది. రెండేండ్ల కింద అనుకొని ప్రమాదంలో నాచెయ్యి విరిగిపోయింది. నేను పింఛన్కు దరఖాస్తు చేసుకోగా, నాకు పింఛన్ మంజూరయ్యింది. సొంతంగా పని చేయడానికి వీలు లేని నాకు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ అండగా నిలుస్తోంది. ఇప్పుడు కొత్తగా సీఎం కేసీఆర్ అంగవైకల్యం గల వాళ్లకు 4వేల పింఛన్ తీసుకురావడంతో మరిం త సంతోషాన్నిస్తున్నది.
పేదోళ్లకు వృద్ధులకు ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్ అందించి అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడిఉంటాం.. 4 వేల పింఛన్ పథకం ద్వారా తమ బతుకుల్లో వెలుగులు నింపుతున్న మాదేవుడు సీఎం కేసీఆర్కు జీవితాంతం అండగా ఉంటాం.
-కదుర్ల అజయ్, చాట్లపల్లి, జగదేవ్పూర్ మండలం
పింఛన్ రాకుంటే నేనే శాన బాధ పడెటోన్ని..
మిరుదొడ్డి, సెప్టెంబర్ 22 : సీఎం కేసీఆర్ సార్ నెలకు రూ.2016 పింఛన్ ఇయ్యకుంటే చిన్న చిన్న ఖర్చులకు మాలాంటి శాతకాని ముసలోల్లకు శాన కస్టమయ్యేది. నెల ఫస్టు రాంగనే సీఎం కేసీఆర్ సార్ పింఛన్ ఎయ్యడంతో తీసుకొని సంతోషంగా ఉంటున్నా. ఓ గప్పుడైతే రూ. రెండు వందల పింఛన్ ఇచ్చి గొప్పలు జెప్పుకుండ్రు. సీఎం కేసీఆర్ సార్ సల్లగుండాలి. గిప్పుడు మా ముసలోళ్లకు సీఎం కేసీఆర్ సార్ పెద్ద దికైండు.
-ర్యాకం కిష్టయ్య, మిరుదొడ్డి, పింఛన్ దారుడు
సీఎం కేసీఆర్ దయతో రూ.4 వేల పింఛన్
నాకు కాళ్లు, చేతులు పోలియో వచ్చి చచ్చుబడిపోయినా సీఎం కేసీఆర్ సార్ నా తండ్రిలాగా ఆదుకుంటున్నడు. ప్రతి నెలా రూ.4 వేలు పింఛ న్ ఇస్తుం డు. ఆ డబ్బులతోనే నేను మందుగోలీలు కొనుక్కుంటున్న. సీఎం కేసీఆర్ సారే నన్ను బతికిస్తున్నడు. రాబోయే ఎన్నికల్లో నాతో పాటు మా అమ్మానాన్నలు కూడా బీఆర్ఎస్కే ఓటేస్తాం. రూ.4 వేలు ఆర్థిక సాయం చేస్తున్న సారును మళ్లీ సూస్తాం.
-దండు లావణ్య, దామరచెర్వు, రామాయంపేట
సీఎం కేసీఆర్ ఆలోచనలు బాగున్నాయి..
తెలంగాణ రాష్ట్రానికి ముచ్చటగా మూడో సారి కేసీఆర్ సారునే ముఖ్యమంత్రిని చేస్తాం.నాకు చిన్నప్పటి నుంచి పోలియో వచ్చి కాలు నడవడం ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్ వాళ్లు ఉన్నత కాలం 40 ఏండ్లుగా నాకు పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ సారు రెండు వేల పింఛన్ నుంచి ఏకంగా రూ.4 వేలు ఇస్తుండు. నాకు ఖర్చులన్నీ దాంట్లో నుంచే పెట్టుకుంటున్నా.
-మధునాల ఎల్లాగౌడ్, దామరచెర్వు
దివ్యాంగుల జీవితాలను మార్చిన మహానాయకుడు
రాష్ట్రంలో దివ్యాంగుల జీవితాలను మార్చింది సీఎం కేసీఆరే. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏలిన ప్రభుత్వాలు వికలాంగులను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఒక్క కేసీఆర్ సారు మాత్రమే రాష్ట్రంలోని అన్ని రంగాలకు చెందిన అర్హులైన వారికి పింఛన్ మంజూరు చేస్తుండు. అందులో భాగంగా దివ్యాంగులకు రూ.4 వేలు ఇచ్చి ఆదుకుంటున్నడు. దివ్యాంగులందరం ఆయనకు జీవిత కాలం రుణపడి ఉంటాం.
-కుమార్, గొల్పర్తి, రామాయంపేట
కేసీఆర్ సారుసల్లగుండాలె
నాలాంటి వృద్ధులకు కేసీఆర్ ఇచ్చే పింఛనే ఆసరైతున్నది. పింఛన్ లేకపోతే జీవితమే ఆగమైతది. కాలునొచ్చినా, ఏలునొచ్చినా మందులకు డబ్బు లు కావాలే. పిల్లలను అడిగితే ఎక్కడి నుంచి ఇస్తరు.. సర్కారు ఇచ్చే పించన్ పైసలే మం దులకు అక్కరకొస్తున్నాయి. నెలనెలా పిం ఛన్ వస్తుందనే ధైర్యంతోనే బతుకుతున్నాం. పింఛన్ రాకపోతే జీవించడం కష్టం. పెద్ద కొడుకు లెక్క సీఎం కేసీఆర్ ముసలొల్లను సాదుతుండు. వృద్ధులకు పింఛన్ ఇచ్చి సాదుతున్న కేసీఆర్ సారు సల్లగుండాలె.
-దాసరి సత్యనారాయణ, బైరాన్పల్లి,ధూళిమిట్ట మండలం
పొగచూరిన బతుకుల్లో వెలుగులు
పొగాకు వాసనను రోజం తా పీల్చుకుంటూ బీడీలు చుడుతున్నాం.గత పాలకులు మా బీడీ కార్మికులను పట్టించుకోలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బీడీ కార్మికుల కుటుంబ ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకుని, మా బాధలను అర్థం చేసుకున్నాడు. ప్రతి నెలా బీడీ కార్మికుల పింఛన్ రూ.2016 లను మా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ, పొగచూరిన మా బతుకుల్లో వెలుగులు నింపుతున్నాడు. ప్రజలందరీ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టి పారదర్శకంగా అమలు చేస్తుండు.
-విజయ, బీడీ కార్మికురాలు,నస్కల్, నిజాంపేట
కంటికి రెప్పోలె కాపాడుతుండు
నేను వ్యవసాయం చేస్తుం టా. వయస్సు మీద పడుతున్నా కొద్ది మునపటి లెక్క వ్యవసాయ పనులు చేయలేక పోతున్నా. గత సంవత్సరం నుంచి నాకు ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. నా లాంటి ఎంతో మందికి సీఎం సార్ ప్రతి నెలా పింఛన్ పైసలు అకౌంట్లో వేసి ఆదుకుంటున్నాడు. వచ్చిన పైసల్లో సగం ఇంట్లోకి సగం నా అవసరాలకు వాడుకుంటా. ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో పూర్తిగా తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే. వృద్ధాప్యంలో మమ్ములను కంటికి రెప్పోలె కాపాడుతుండు.
-రాజయ్య,పింఛన్దారుడు,నిజాంపేట
సీఎం కేసీఆర్ సారే.. మా పెద్ద దిక్కు
సీఎం కేసీఆర్ మా పేదోళ్లకు నిజమైన దేవుడు. మాపై విధి చిన్నచూపు చూస్తే.. కేసీఆర్ సర్కారు అండగా నిలిచింది. నా భర్త భూమయ్య 2009లో గుండెపోటుతో సచ్చిపోయిండు. మాకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇందులో బిడ్డ భాగ్యమ్మ(33) మరుగుజ్జు, చిన్న కొడుకు నరేశ్ (29) బుద్ది మాంద్యం . సీఎం కేసీఆర్ సారు ఇస్తున్న ఆసరా పింఛన్ మాకు జీవనాధారం. నాకు వింతతు పింఛన్ కిందా రూ.2016 వస్తుంది. ఇద్దరు పిల్లలకు (దివ్యంగులకు) రూ.4016 చొప్పున పింఛన్ వస్తుంది. నెలకు రూ.10 వేలు పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. మా కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచాడు.
– బైండ్ల నర్సవ్వ, దుబ్బాక
మా బతుకుల్లో కేసీఆర్ వెలుగులు నింపిండు
సమైక్య రాష్ట్రంలో బీడీ కార్మికులను పట్టించుకోలేదు. రోజంతా బీడీలు చుట్టినా కూలీ గిట్టుబాటు కాకపోయేది. మా కష్టాలను సీఎం కేసీఆర్ దగ్గరుండి చూశారు. కేసీఆర్ సారు వచ్చినంకనే బీడీ కార్మికులకు ఇంత రేవు చేసిండు. నెలనెలా రూ.2016 పింఛన్ ఇచ్చి మమ్ములను తండ్రిలాగా ఆదుకుండు. బీడీలు చుడితే వచ్చిన పైసలకుతోడు కేసీఆర్ ఇచ్చే పింఛన్ ఆసరైతంది. ఆపైసలతోనే కుటుంబాన్ని సాదుకుంటున్నాం. మునుపటి కంటే ఇప్పుడు కూలీరేట్లు కూడా పెరిగాయి. పొగచూరిన మా బతుకుల్లో కేసీఆర్ వెలుగులు నింపిండు. బీడీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మేలును ఎన్నడూ మరువం. బీడీ కార్మికులంతా కేసీఆర్సారుకు రుణపడి ఉంటారు.
-వగలబోయిన మేఘమాల, వగలబోయినలక్ష్మి, తాళ్లపల్లిలక్ష్మి,సలాఖపూర్, మద్దూరు మండలం
పింఛన్ రాకుంటే మా బతుకులు ఆగమే..
హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 22: పింఛన్ రాకుంటే మా బతుకులు ఆగమైతుండే. సీఎం కేసీఆర్ దేవుడిలాగా ప్రతి నెలా పింఛన్ ఇస్తున్నారు. నా భార్యతోపాటు నాకు కూడా పింఛన్ డబ్బులు వస్తున్నాయి. మా పెద్దకొడుకులాగా కేసీఆర్ సారు ఆదుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరి డబ్బులతోనే బీపీ, కాళ్లనొప్పుల మందులు కొన్కుని బతుకుతున్నాం. పింఛన్ డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్సారుకు రుణపడి ఉంటాం.
మా ఇంట్లో ముగ్గురికి దివ్యాంగుల పింఛన్
మా కుటుంబంలో నాతో పాటు ఇద్దరు సోదరీమణులు లక్ష్మి, నీలమ్మ ముగ్గురం మరగుజ్జులుగా పుట్టినం. మాకు ఎలాంటి ఉపాధి లేదు. మా ముగ్గురికి బతుకు భారమైంది. సీఎం కేసీఆర్ సార్ అందించిన దివ్యాంగుల ఆసరా పింఛన్తో మా కు ఆర్థిక భరోసా లభించింది. మొన్నటి వరకు నెలకు రూ.3వేలు ఉన్న పింఛన్, ఇప్పుడు మరో వెయ్యి రూపాయలు పెరిగి, గత నెల నుంచి రూ.4వేలు ఇస్తున్నారు. ఈ పింఛన్ మా ముగ్గురికి ఎంతో ఆసరా అవుతున్నది. ఇదే ఇప్పుడు మాకు కుటుంబ పోషణ అయితున్నది. మాకు చాలా సంతోషంగా ఉంది. పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్ సార్కు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
-సంగయ్యస్వామి, గ్రామం. ఉజలంపాడ్, సిర్గాపూర్ మండలం. (సంగారెడ్డి జిల్లా)
సీఎం కేసీఆర్ను యాది చేసుకుంటాం..
మాకు గుంట భూమి లేదు. కొన్నేళ్ల క్రితం మా నాన్న చనిపోయాడు. నేను చిన్నప్పుడు చెట్టు పై నుంచి పడటంతో నా ఎడమ చెయ్యి పూర్తిగా తీసేశారు. ఇప్పుడు సర్కారు నుంచి నాకు రూ. 4016, మా అవ్వకు రూ. 2016 ఆసరా పింఛన్ డబ్బులు నెల నెలా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. ఆపైసలతోనే మా కుటుంబం గడుస్తున్నది. నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు జిలెల్లగడ్డలోని ప్రభుత్వ గురుకులం, చిన్న కుమారుడు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదవుకుంటున్నారు.
పిల్లల చదువులతోనే పెద్ద రందీ ఉండేది. కానీ పిల్లలిద్దరూ సర్కారు బడుల్లో చదువుకుంటుండటంతో ఏమీ ఇబ్బం ది లేదు. సీఎం కేసీఆర్ దయ వల్ల మంచిగా బతుకుతున్నాం. రోజులో ఒక్కసారైనా మా భార్య,పిల్లలు, మా అవ్వ కేసీఆర్ను యాది చేసుకుంటాం. ఆయన ఎల్లప్పుడూ సల్లంగా ఉండాలె. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-నందరబోయిన రాజు, దివ్యాంగుడు, అక్కన్నపేట
సీఎం కేసీఆర్కు రుణపడిఉంటాం..
మర్కూక్,సెప్టెంబర్22: సీఎం కేసీఆర్ సారు దివ్యాంగులకు నెలనెలా మూడువేల పదహారు రూపాయలు ఇచ్చి ఆదుకున్నాడు. ఇంతకు ముం దున్న గవర్నమెంట్ రూ. ఐదు వందలు మాత్రమే ఇచ్చేది. రాష్ట్రంలో ఎందరో ది వ్యాంగులకు కేసీఆర్ తండ్రిలాగా పింఛన్ ఇవ్వడమే కాకుండా మూడు చక్రాలబండి కూడా ఇచ్చారు. సీఎం కేసీఆర్ సారుకు రుణపడిఉంటా.
-బాపురెడ్డి, దివ్యాంగుడు, మర్కూక్
సార్ ఇచ్చే పింఛన్తో ఇల్లు గడుస్తున్నది..
నా భర్త దివ్యాంగుడు కావడంతో ఆయనకు పింఛన్ వస్తున్నది. అట్లనే నాకు వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. దివ్యాంగుల పింఛన్ మరో వెయ్యి పెం చడంతో ఆయనకు రూ.4016, నాకు రూ. 201 6 వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్తో మాకు ఇల్లు గడుస్తుంది. సీఎం సార్కు రుణపడి ఉంటాం. చేతగాని సమయంలో ఆసరాగా మా కు నెల నెలా పింఛన్ ఇస్తున్న కేసీఆర్ సార్ సల్లగా ఉండాలి.
– తలారి బాలవ్వ, మర్రిముచ్చాల, కొమురవెల్లి మండలం
బతుకుదెరువు తెచ్చింది
వర్గల్,సెప్టెంబర్ 22 : పేరుకే కాళ్లు చేతులు. అడుగేసి అడుగునడవరాదు. గజందూరం పోరాదు. భూ మినిపట్టుకొని దేకుడు తప్పా? ఇలా అవిటి దానిని అయినా అనుకొని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కాలం ఎలదీస్తున్నా.. సర్కారు అందించిన ఆసరా పింఛన్, స్కూటీ మోటర్తో నడుస్తున్నా… ముఖ్యమత్రి కేసీఆర్ సారు నెలకు రూ, 3016 పింఛన్ ఇస్తుండటంతో నాపై నాకే భరోసా పెరిగింది. కేసీఆర్ సారు పుణ్యంతో నాకు జీవితంపై భరోసా కుదిరింది. ఇంత మేలు ఏ ముఖ్యమంత్రి జేయలె
-బుడిగె లక్ష్మి (గోవిందాపూర్ దివ్యాంగురాలు, వర్గల్ మండలం)
ప్రభుత్వం మాకు ఆసరైంది..
రెండు సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛన్ వస్తున్నది. ప్రతి నెలా ఠంచన్గా పింఛన్ ఇస్తూ సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కపాడుకుంటున్నారు. నాతో పాటు మా భార్య వెంకటలక్ష్మికి బోదకాలు ఉండటంతో ప్రభుత్వం గత సంవత్సరం నుంచి పింఛన్ వస్తున్నది. పింఛన్ డబ్బులతో ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నాం. మా భా ర్యకు మందులు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చే పింఛన్ మాకు ఉపయోగపడుతున్నది. ప్రతి నెల మా ఇద్దరికి రూ.4000 వేలు ఇస్తూ ప్రభుత్వం ఆసరైంది. సీం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు.
-బోయిని వెంకటలక్ష్మి- మల్లేశం, గుర్రాలగొంది
ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి నెలా రూ.102.22 కోట్లు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.102.22 కోట్లు లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నది. ఇందులో దివ్యాంగులు 37,785 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరి కోసం ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ. 4,016 చొప్పున రూ.15,17,44,560 జమ చేస్తున్నది. మిగతా వర్గాల వారు 4,31,790 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 87,04, 88,640 కోట్లు చెల్లిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో చూసుకుంటే ప్రతి నెలా 1,91,185 మంది లబ్ధిదారులకు రూ.41.39కోట్లు లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తున్నారు.
వీటిలో 14,237 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.5,71,75,792 కోట్లు, మిగతా వర్గాలు 1,76,948 మంది లబ్ధిదారులకు రూ. 35,67,27,168 కోట్లు చెల్లిస్తున్నారు.మెదక్ జిల్లాలో ప్రతి నెలా 1,16,728 లబ్ధిదారులకు రూ. 25.24 కోట్లు చెల్లిస్తున్నారు. వీరిలో దివ్యాంగులు 8,558 మందికి రూ. 3,43,68,928 కోట్లు చెల్లిస్తున్నారు. మిగతా వర్గాల వారు 1,08,170 మంది లబ్ధిదారు లకు రూ. 21,80,70,720 కోట్లను బ్యాంక్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో ప్రతినెలా 1.61, 662 మంది లబ్ధిదారులకు రూ.35.58 కోట్ల పింఛన్ ఇస్తున్నారు. వీటిలో దివ్యాంగులు 14,990 మంది లబ్ధిదారులకు రూ. 6,01, 99,840 కోట్లు, మిగతా వర్గాల వారు 1,46,672 మందికి రూ. 29,56,90,752 కోట్లను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో బీఆర్ఎస్ ప్రభుత్వం జమచేస్తున్నది.
పింఛన్ ఎంతో ఆసరా
కోహెడ సెప్టెంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న పింఛన్ ఎంతో ఆసరా అవుతున్నది. రూ. 2016 రూపాయలు కుటుంబ ఖర్చులకు సరిపోతున్నాయి. భర్త చనిపోయిండు. పచ్చి కంకులు అమ్ముకుంటున్నా . పింఛన్ రాగానే ఖర్చులు ఎల్లుతున్నాయి లేకుంటే ఎంతో కష్టం అయ్యేది. సీఎం కేసీఆర్సారుకు రుణపడి ఉంటా.
-ఎడ్ల ఐలవ్వ, వితంతువు పింఛన్దారు, కోహెడ