హత్నూర : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హత్నూర, సికింద్లాపూర్, మంగాపూర్, కాసాల, బోర్పట్ల, రెడ్డిఖానాపూర్ గ్రామాల్లోని చెరువుల్లో 8 లక్షల 84వేల విలువగల చేప పిల్లలు వదిలారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుల వృత్తుల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎంపీపీ నర్సింలు, జడ్పీటీసీ ఆంజనేయులు, డైరెక్టర్లు దామోదర్రెడ్డి, దుర్గారెడ్డి, కృష్ణ, సర్పంచ్ వీరస్వామిగౌడ్, టీఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి సతీశ్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీశైలం, అసిస్టెంట్ మౌనిక, నాయకులు రవి, కిష్టయ్య, నరేందర్, బుచ్చిరెడ్డి, ఆంజనేయులు, రాములు, ధనుంజయ, జనార్దన్, ప్రవీణ్గౌడ్ పాల్గొన్నారు.
విద్యార్థులకు మాస్కులు పంపిణీ
మండల కేంద్రమైన హత్నూర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.