సిద్దిపేట, అక్టోబర్ 17: సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభ ముగించుకొని బస్సులో హైదరాబాద్ వెళ్తున్న సీఎం కేసీఆర్ సిద్దిపేట పొన్నాల దాబా వద్ద ఆగి మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాలకిషన్రావుతో కలిసి టీ తాగారు.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట బిడ్డనే అనే విధంగా టీ తాగి పాతరోజులను గుర్తు చేసుకొని పురిటిగడ్డపై ప్రేమను చాటుకున్నారు.