క్రిస్మస్ను పురస్కరించుకొని చర్చీలు ముస్తాబయ్యాయి. ఆదివారం అర్థరాత్రి నుంచి పండుగ సంబురాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చీలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
క్రైస్తవులు తమ ఇండ్లపై రకరకాల స్టార్స్ను వేలాడదీశారు. వైవిధ్య అలంకరణలు, విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలు, శాంటాక్లాజ్ దుస్తులు, బెలూన్లతో చర్చీలు, ఇండ్లు కొత్త శోభను సంతరించుకున్నాయి.