సంగారెడ్డి, డిసెంబరు 3 : అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది. సంగారెడ్డి గడ్డ.. బీఆర్ఎస్ అడ్డ అని నియోజకవర్గ ప్రజలు నిరూపించారు. ఆదివారం పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం శివారులో గీతం యూనివర్సిటీలో ఓట్ల లెకింపు జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన లెక్కింపు మందకొడిగా సాగడంతో సంగారెడ్డి ఫలితం రావడానికి కొంత జాప్యం జరిగిందని చెప్పవచ్చు. సంగారెడ్డి ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేయడంతో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 9,297వేల మెజార్టీతో విజయం సాధించారు. తొలి నాలుగు రౌం డ్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి మెజార్టీ రాగా, 5 నుంచి 9 రౌండ్ల వరకు కాంగ్రెస్కు అధిక్యం వచ్చింది. 10వ రౌండ్ నుంచి 17 వరకు మెజార్టీ వచ్చింది. 18వ రౌండ్లో కాంగ్రెస్కు అధిక్యం లభించినా 9,297వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో 184979 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్కు 82614 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 73317 ఓట్లు వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు గణేశ్గడ్డ నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు తరలివచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం చింతా ప్రభాకర్కు శుభాకాంక్షలు తెలిపారు.
కొండాపూర్, డిసెంబర్ 3 : సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై 7 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయిసాథ్ను కొండాపూర్ మండల నాయకులు కలిసి శభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, వైస్ ఎంపీపీ లక్ష్మీరామచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, సర్పంచులు శివలీలాజగదీశ్వర్, ప్రకాశం, ఉపసర్పంచ్ ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీలు రాజేశ్వర్రావు దేశ్పాండే, యాదయ్య, మొఖీం, ఎంపీటీసీలు బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మ్యా కం విఠల్, బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్రెడ్డి, మోహన్గౌడ్, సంతోష్రెడ్డి, డైరెక్టర్ శేఖర్, జైరాం, రఘునాథ్రెడ్డి, జలీల్, గురుకిరణ్, నరేందర్యాదవ్ పాల్గొన్నారు.
కంది, నవంబర్ 3 : సంగారెడ్డి ఎమ్మెల్యేగా చింతా ప్రభాకర్ గెలుపొందడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కందిలో సంబురాలు జరుపుకొన్నారు. దీంతో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్కు అండగా నిలిచిన సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కంది ఉప సర్పంచ్ ఖురేషీ, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, నాయకులు రవి, ఆనంద్రావు పాల్గొన్నారు.