కంది/ సదాశివపేట/ కొండాపూర్, మే 10 : రైతన్న సుభిక్షంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నా రు. కంది మండల పరిధిలోని కలివేముల, ఇంద్ర కరణ్, చిద్రుప్ప గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. చివరి గింజా వరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జడ్పీటీసీ కొండల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సరళాపుల్లారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చేర్యాల ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణగౌడ్, బీఆర్ఎస్ కంది మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రైతు ప్రభుత్వమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ మండలంలోని తొగర్పల్లి గ్రామాల్లోని సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జడ్పీటీసీ పద్మావతి పాం డురంగం, వైస్ ఎంపీపీ లక్ష్మీ రాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, సర్పంచ్లు మౌ నిక శ్రీధర్రెడ్డి, నర్సింహులు, ప్రకాశం, పీఏసీఎస్ చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, పవన్ కుమార్, ఎంపీటీసీలు సంతోష, రాందాస్, ఉప సర్పంచ్ రామప్ప, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
పల్లెల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేట మండల పరిధిలోని వెల్టూర్లో నిజాంపూర్ క్రాస్ రోడ్డు నుంచి ముబారక్పూర్ వరకు రూ. 2.65 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సదాశివపేట మండలంలో 26 బీటీ రోడ్లకు రూ. 51.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పట్టణంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రా రంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, సర్పంచ్ లక్ష్మారెడ్డి, ఎంపీడీవో పూజ, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, సొసైటీ చైర్మన్ రత్నాకర్రెడ్డి, మాజీ సర్పంచ్, కురుమ సంఘం మండలాధ్యక్షుడు సత్యనారాయణ కురుమ, రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నవీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.